Jagapathi Babu : క్రూరమైన విలన్గా మారిన జగ్గు భాయ్.. సలార్ సినిమానుంచి రాజమన్నార్ లుక్..
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా రాణించిన జగపతిబాబు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఫుల్ బిజీగా గడుపుతున్నారు. చాలాకాలం గ్యాప్ తర్వాత విలన్..
Jagapathi Babu : ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా రాణించిన జగపతిబాబు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఫుల్ బిజీగా గడుపుతున్నారు. చాలాకాలం గ్యాప్ తర్వాత విలన్ అవతారమెత్తిన జగ్గూభాయ్ ఇప్పుడు వరుస ఆఫర్లతో దూసుసుపోతున్నారు. బోయపటి నటసింహం బాలకృష్ణ కామినేషన్లో వచ్చిన లెజెండ్ సినిమాతో విలన్గా రీఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు. ఆ తర్వాత పలు సినిమాల్లో విలన్గా, హీరో తండ్రిగా నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇక సుకుమార్ -రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమాలో జగపతిబాబు నటన నిజంగా అద్భుతమనే చెప్పాలి. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ నటించిన అరవింద సమెత సినిమాలోనూ తన విలనిజంతో భయపెట్టారు జగపతి బాబు. ఇక ఇప్పుడు ప్రభాస్ సినిమా కోసం మరోసారి విలన్గా మారనున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ వరుసగా భారీ సినిమాలను లైనప్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేజీఎఫ్ ఫెమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమాలో మాఫియా డాన్గా కనిపించనున్నాడు డార్లింగ్ . సలార్ సినిమాలో ప్రభాస్ను ఢీ కొట్టే ప్రతినాయకుడిగా జగపతిబాబు కనిపించనున్నాడు. తాజాగా జగపతి బాబు క్యారెక్టర్ను రివీల్ చేస్తూ అదిరిపోయే పోస్టర్ను విడుదల చేశారు చిత్రయూనిట్. జగపతిబాబు ఈ చిత్రంలో రాజమన్నార్ పాత్రలో కనిపించనున్నారు . ఈ సినిమాలో జగపతి బాబు గెటప్ చూస్తుంటే క్రూరమైన విలన్ నటిస్తున్నారని అర్ధమవుతుంది. సలార్ మూవీ కీలక షెడ్యూల్ను ఇటీవల పూర్తి చేశారు. ఫిబ్రవరి 2022 కి సినిమా పూర్తవుతుంది. ఈ సంవత్సరం చివరిలోగా కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :