కరోనా ఎఫెక్ట్.. గుట్టు చప్పుడు కాకుండా యంగ్ టైగర్ ఇంట శుభకార్యం… ఆనందంలో అభిమానులు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో గిరిజన వీరుడు కొమురం భీమ్ గా కనిపించనున్నాడు తారక్.
jr ntr : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో గిరిజన వీరుడు కొమురం భీమ్ గా కనిపించనున్నాడు తారక్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు,టీజర్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా ఫేమ్ అందుకోనున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు తారక్. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని పరిశిలీస్తున్నారు.ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. అంతే కాదు తారక్ కూడా కరోనా బారిన పడ్డారు. ఇటీవలే ఆయన ఆ మహమ్మారి నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం తారక్. క్కరోనా కల్లోలం తగ్గిన వెంటనే తిరిగి షూటింగ్ లను ప్రారంభించనున్నారు.
ప్రస్తుతం కరోనా కారణంగా ఏది కూడా కోరుకున్నట్లుగా జరగటం లేదు. అలాగని జరుపుకోవడానికి అనుమతి లేదు. అయితే తారక్ కరోనా కారణంగా తన పుట్టిన రోజు వేడుకలు జరపవద్దని అభిమానులను కోరిన విషయం తెలిసిందే. తారక్ చెప్పినట్టుగా అభిమానులు ఎవ్వరు ఆయన పుట్టిన రోజు వేడుకలు జరపలేదు. తాజగా తన ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమాన్ని కూడా గుట్టుచప్పుడు కాకుండా కనిచేశారట యంగ్ టైగర్. ఎన్టీఆర్ ఆయన చిన్నకొడుకు భార్గవ్ రామ్ తో ఆదివారం అక్షరాభ్యాసం జరిపించినట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలిసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :