Salaar: హాలీవుడ్ రేంజ్లో యాక్షన్ సీన్స్.. ‘సలార్’ ఫైట్స్ కోసం 750 భారీ వాహనాలు..
చాలా కాలం తర్వాత పూర్తి స్థాయిలో మాస్ అండ్ యాక్షన్ హీరోగా ప్రభాస్ కనిపించనున్నాడు. దీంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్ధామా అని వెయిట్ చేస్తున్నారు వరల్డ్ వైడ్ ఫ్యాన్స్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మరోవైపు డబ్బింగ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ దగ్గర్నుంచి

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న సలార్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ 1,2 చిత్రాలతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద హిస్టరీ క్రియేట్ చేసిన నీల్.. ఇప్పుడు సలార్ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ షేక్ చేసిందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. అలాగే బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రాలన్ని అభిమానులను నిరాశపరిచిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆశలన్నీ సలార్ చిత్రంపైనే ఉన్నాయి. అంతేకాకుండా చాలా కాలం తర్వాత పూర్తి స్థాయిలో మాస్ అండ్ యాక్షన్ హీరోగా ప్రభాస్ కనిపించనున్నాడు. దీంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్ధామా అని వెయిట్ చేస్తున్నారు వరల్డ్ వైడ్ ఫ్యాన్స్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మరోవైపు డబ్బింగ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ దగ్గర్నుంచి యాక్షన్ సీన్స్ వరకు ప్రతి విషయం ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
తాజాగా నెట్టింట వినిపిస్తోన్న సమాచారం ప్రకారం భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రంలో కొన్ని యాక్షన్ సీన్స్ హాలీవుడ్ చిత్రాలను తలదన్నేలా ఉంటాయని అంటున్నారు. ఈ యాక్షన్ సీన్స్ కోసం దాదాపు 750కి పైగా జీప్ లు.. భారీ ట్యాంకులు, ట్రక్కులు ఇలా విభిన్న భారీ వాహానాలను ఉపయోగించారని.. ఈ సినిమాలో చాలావరకు ఆన్ గ్రౌండ్ యాక్షన్ ఉంటుందని తెలుస్తోంది. హాలీవుడ్ సినిమాల్లో పెద్ద వార్ సీక్వెన్స్ తీసే సమయంలో మాత్రమే ఈస్థాయి వాహనాలను.. టెక్నీకల్ టీంను ఉపయోగిస్తారట. ఇప్పుడు సలార్ కోసం అదే స్థాయిలో వాహనాలను ఉపయోగించడంతో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.
View this post on Instagram
రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుడంగా.. మలయాళం హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అలాగే కీలకపాత్రలో జగపతి బాబు కనిపించనున్నారు. ఇక కేజీఎఫ్ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ ఈ మూవీని నిర్మిస్తుంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ కు ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో చెప్పక్కర్లేదు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
