రీంనగర్ జిల్లా చిన్నపాపయ్యపల్లెలో రైతు తనుగుల సంపత్ పొలంలో అరుదైన పాముల సయ్యాట దృశ్యం ఆవిష్కృతమైంది. దాదాపు 30 నిమిషాల పాటు రెండు పాములు పెనవేసుకొని నాట్యం చేస్తున్నట్లు కనిపించాయి. ఈ అద్భుత దృశ్యాన్ని సంపత్ తన మొబైల్లో చిత్రీకరించగా, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వన్యప్రాణి నిపుణుల ప్రకారం ఇది వర్షాకాలంలో జరిగే అరుదైన ఆధిపత్య పోరాటం లేదా జతకట్టే ప్రక్రియ.