AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhar News: రూపాయికి 3 రూపాయలు.. మార్కెట్‌లోకి నయాదందా! నమ్మారంటే ఇక అంతే!

తిరుపతి జిల్లాలో కొత్తరకం దందా వెలుగు చూసింది. రూపాయికి రూ. 3 ఇస్తామంటూ బురిడీ కొట్టిస్తున్న ఓ ముఠా మోసాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఒకటికి రెండింతల డబ్బులు ఇస్తామని.. ఓ రియల్‌ ఎస్టేట్ వ్యాపారి నుంచి ఏకంగా రూ.14లక్షలు కాజేసిన ఈ ముఠా కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చేపట్టారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Andhar News: రూపాయికి 3 రూపాయలు.. మార్కెట్‌లోకి నయాదందా! నమ్మారంటే ఇక అంతే!
Black Money Fraud
Raju M P R
| Edited By: |

Updated on: Jun 17, 2026 | 8:03 AM

Share

రూపాయికి 3 రూపాయలు ఇస్తామంటూ ఓ రియల్‌ఎస్టేట్ వ్యాపారి నుండి రూ.14లక్షలు కాజేశారు కొందరు కేటుగాళ్లు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. వివరాల్లో కెళ్తే.. స్థానికంగా రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తున్న రవి చంద్రారెడ్డి అనే వ్యక్తికి ఇటీవలే చిల్లకూరుకు చెందిన శ్రీనివాసుస్‌, జీవకోనకు చెందిన గుణశేఖర్‌తో పరిచయం ఏర్పడింది. వీళ్ళ మధ్య పరిచయంలో బ్లాక్ మనీ, రైస్ పుల్లింగ్ వ్యవహారాలు తరచూ చర్చకు రాగా తిరుపతికి చెందిన లక్ష్మీ ప్రియ అనే మహిళ దగ్గర బ్లాక్ మనీ ఉందని రూపాయికి రూ. 3 రూపాయలు వస్తుందని నమ్మించే ప్రయత్నం జరిగింది. లక్ష్మీ ప్రియ అనే మహిళకు గుణశేఖర్ తో బాగా పరిచయం ఉందని బ్లాక్ మనీ చాలామణి చేస్తే తమకు కమిషన్ వస్తుందని రవిచంద్ర రెడ్డికి గాలం వేశారు. ఈ మేరకు లక్ష్మీ ప్రియతో రవిచంద్ర రెడ్డిని ఫోన్‌లో కూడా మాట్లాడించిన గుణశేఖర్, శ్రీనివాసులు పక్కా ప్లాన్ అమలు చేశారు.

ఇందులో భాగంగానే రవి చంద్రారెడ్డిని నమ్మించిన ముఠా రూ. 14 లక్షలు నగదుతో ఏర్పేడు సమీపంలోని మేర్లపాక వద్దకు రమ్మన్నారు. ఈ మేరకు క్యాష్ తో స్పాట్‌కు చేరుకున్న రవిచంద్ర రెడ్డిని కారులో ఎక్కించుకున్న లక్ష్మీ ప్రియా ముఠా దారిలో దాడి చేసి, నగదు లాక్కుంది. కారులో లక్ష్మీ ప్రియతో పాటు ఉన్న మరో ముగ్గురు ముఠా.. ఆర్ మల్లవరం వద్ద కారు నుండి రవిచంద్ర రెడ్డిని తోసివేసి పరారైంది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు ఏర్పేడు పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన విషయం మొత్తం పోలీసులకు చెప్పి ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, శ్రీనివాస్, గుణశేఖర్ అదుపులోకి తీసుకున్నారు.

ఇక నగదుతో పరారైన లక్ష్మీప్రియ, మరో ఇద్దరి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఒకటికి మూడింతలు డబ్బు ఇప్పిస్తామంటే ఆశ పడ్డ డబ్బులు కోల్పోయిన రవి చంద్రారెడ్డిని సైతం పోలీసులు ప్రశ్నించారు. అయితే అతను పొంతనలేని సమాధనాలు చెప్పడంతో అనుమానం వచ్చిన పోలీసులు.. ఇది రైస్ పుల్లింగ్ ముఠాగా అనుమానిస్తున్నారు. ఈ ముఠా గురించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రూపాయికి 3 రూపాయలు.. మార్కెట్‌లోకి నయాదందా! నమ్మారంటే ఇక అంతే!
రూపాయికి 3 రూపాయలు.. మార్కెట్‌లోకి నయాదందా! నమ్మారంటే ఇక అంతే!
ఒకప్పుడు నాగ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు టాప్ హీరో
ఒకప్పుడు నాగ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు టాప్ హీరో
నేటి మ్యాచ్‌లో ఇద్దరు స్టార్ ప్లేయర్లకు ఛాన్స్
నేటి మ్యాచ్‌లో ఇద్దరు స్టార్ ప్లేయర్లకు ఛాన్స్
అవినీతిలో నెం1 ఆఫీసర్.. నరహరి చిట్టా తెలిస్తే అవాక్కవ్వాల్సిందే
అవినీతిలో నెం1 ఆఫీసర్.. నరహరి చిట్టా తెలిస్తే అవాక్కవ్వాల్సిందే
రైతుల భరోసా విడుదలకు ముహూర్తం ఫిక్స్.. అకౌంట్లోకి అప్పుడే..
రైతుల భరోసా విడుదలకు ముహూర్తం ఫిక్స్.. అకౌంట్లోకి అప్పుడే..
IAF అధికారి భార్యపై అత్యాచారం, బ్లాక్‌మెయిల్‌.. చివరకు మతమార్పిడి
IAF అధికారి భార్యపై అత్యాచారం, బ్లాక్‌మెయిల్‌.. చివరకు మతమార్పిడి
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తల్లికి వందనం డబ్బులు పడేది అప్పుడే
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తల్లికి వందనం డబ్బులు పడేది అప్పుడే
అత్యంత తక్కవ ధరకే విమాన ప్రయాణం చేయవచ్చు..
అత్యంత తక్కవ ధరకే విమాన ప్రయాణం చేయవచ్చు..
ఐర్లాండ్ పర్యటనలో ఈ నలుగురు కేవలం నీళ్లందించేందుకే.. ఎందుకంటే?
ఐర్లాండ్ పర్యటనలో ఈ నలుగురు కేవలం నీళ్లందించేందుకే.. ఎందుకంటే?
సరదా కోసం వెళ్లి.. అమెరికా విమాన ప్రమాదంలో కర్నూలు వాసి మృతి
సరదా కోసం వెళ్లి.. అమెరికా విమాన ప్రమాదంలో కర్నూలు వాసి మృతి