Tollywood: ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో చూశారా ?.. రెండు కళ్లు చాలవు..
ఏంటీ కూలెక్కలేదా వాటరు' అనే డైలాగ్తో తెగ ఫేమస్ అయ్యింది రచన. గోదావరి యాసలో ఆమె పలికిన ఆ ఒక్క డైలాగ్ ఆమెకు గుర్తింపు తీసుకువచ్చింది.
చైల్డ్ ఆర్టిస్ట్గా పలు హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతుంటారు పలువురు చిన్నారులు. ఒక్క సినిమాతోనే గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత మరో చిత్రంలో కనిపించకుండా మయమైపోతుంటారు. చిన్నప్పుడు క్యూట్గా వెండితెరపై కనిపించి ఆడియన్స్ ను అలరించిన బాల నటీనటులు ఇప్పుడు మరింత అందంగా హీరోహీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాకుండా ఉంటారు. అలాంటి చైల్డ్ ఆర్టిస్టులలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఒకరు. ఆ అమ్మాయి పేరు రచన. 2013లో సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో వెంకటేష్, మహేష్ బాబు , సమంత, అంజలి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాలో సమంత గ్యాంగ్ లో ఉండే అల్లరి అమ్మాయి రచన.
‘ఏంటీ కూలెక్కలేదా వాటరు’ అనే డైలాగ్తో తెగ ఫేమస్ అయ్యింది రచన. గోదావరి యాసలో ఆమె పలికిన ఆ ఒక్క డైలాగ్ ఆమెకు గుర్తింపు తీసుకువచ్చింది. ఈ సినిమా తర్వాత మరో సినిమాలో కనిపించలేదు రచన. 2019లో పెళ్లి చేసుకుంది రచన. 2020లో ఓ పాప జన్మించింది. ప్రస్తుతం తన భర్తతో కలిసి సింగపూర్ లో ఉంటున్న రచనకు ఈ ఏడాది మరో పాపు జన్మించింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది రచన.
రీల్స్ చేయడమే కాకుండా . ఫ్యామిలీ ఫోటోస్ కూడా షేర్ చేస్తుంటుంది రచన. ఈ క్రమంలోనే తాజాగా రచన షేర్ చేసిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. 2013లో ఎస్వీఎస్సీ రిలీజ్ అయ్యింది.. 2023లో రచన గురించి తెలిసింది. 10 ఏళ్లలో ఇంతా మార్పా ? అంటూ తన గురించి మీమ్స్ కూడా వైరలవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.