AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: పెళ్లైన హీరోతో ఎఫైర్.. భార్య వార్నింగ్‏తో బ్రేకప్.. కెరీర్ నాశనం చేసుకున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..

నటనపై ఆసక్తితో ఎంతోమంది అమ్మాయిలు సినీరంగంలోకి అడుగుపెడుతుంటారు. ఈ రంగుల ప్రపంచంలో నటిగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడుతుంటారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని అవకాశాలు అందుకుంటూ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకుంటారు. కానీ కొన్ని తప్పులతో కెరీర్ నాశనం చేసుకుంటారు. ఈ హీరోయిన్ సైతం అలాంటి జాబితాలోనే.

Tollywood: పెళ్లైన హీరోతో ఎఫైర్.. భార్య వార్నింగ్‏తో బ్రేకప్.. కెరీర్ నాశనం చేసుకున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..
Nikita
Rajitha Chanti
|

Updated on: Nov 29, 2024 | 3:39 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ స్టార్ డమ్ సంపాదించుకుంది. మొదటి సినిమాతోనే యూత్ లో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత చేతులారా తన సినీ కెరీర్ నాశనం చేసుకుంది. హీరోయిన్ గా కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే ఓ పొరపాటుతో ఇండస్ట్రీకి దూరమయ్యింది. పెళ్లైన హీరోతో ఎఫైర్.. ఇద్దరు కలిసి డేటింగ్ అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. చివరకు ఆ విషయం కాస్తా ఆ హీరో భార్యకు తెలియడంతో ఈ బ్యూటీకి గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఇంకేముంది అటు హీరోతో బ్రేకప్.. ఇటు సినిమా అవకాశాలకు దూరమయ్యింది. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండి ఆ తర్వాత ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని ఇప్పుడు పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ నిఖిత తుక్రాల్. ఈ పేరు చెబితే గుర్తుపట్టలేరు. కానీ నితిన్ నటించిన సంబరం మూవీ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు.

ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్. 2002లో హాయ్ అనే సినిమాతో వెండితెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత 2003లో వేణు నటించిన కళ్యాణ రాముడు మూవీతో హిట్ అందుకుంది. అలాగే నితిన్ సరసన సంబరం సినిమాలో మెరిసింది. తెలుగులో ఏవండోయ్ శ్రీవారు, మహారాజశ్రీ, డాన్ వంటి చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళం, కన్నడలో వరుస ఆఫర్స్ అందుకుంది. అయితే టాప్ హీరోయిన్ గా కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే కన్నడ నటుడు దర్శన్ ప్రేమలో పడింది. అప్పటికే దర్శన్ కు పెళ్లైంది. అయినా ఇద్దరూ కలిసి క్లోజ్ గానే ఉన్నారు. వీరిద్దరి ప్రేమ వ్యవహరం కాస్త దర్శన్ భార్య విజయలక్ష్మికి తెలిసింది. దీంతో ఆమె నిఖితకు వార్నింగ్ ఇచ్చింది. అయినా ఆమెలో ఎలాంటి మార్పు రాకపోవడంతో పోలీస్ కంప్లైయింట్ ఇచ్చింది. దర్శన్ పై గృహ హింస కేసు పెట్టింది. దీంతో దర్శన్ కొన్నిరోజుల పాటు అరెస్ట్ అయ్యాడు.

ఈ వ్యవహారం తర్వాత నిఖితాపై కన్నడ ఇండస్ట్రీలో మూడేళ్లపాటు నిషేధం విధించారు. ఆ తర్వాత కూడా నిఖితకు ఆఫర్స్ రాలేదు. 2017లో వ్యాపారవేత్త గగన్ దీప్ సింగ్ మాగోను వివాహం చేసుకుని సినీరంగానికి పూర్తిగా దూరమయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో నిఖితా చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.