AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ankitha: సింహాద్రిలో ఎన్టీఆర్‏ను ఆటాడుకున్న హీరోయిన్ అంకిత ఎలా మారిందో చూశారా ?.. ఇప్పుడేం చేస్తున్నారంటే..

ఈ సినిమాలో భూమికతోపాటు.. హీరోయిన్ అంకిత కూడా తన నటనతో ఆకట్టుకుంది. ఈ మూవీలోనే కాకుండా..లాహిరి లాహిరి లాహిరిలో.. ధనలక్ష్మి ఐ లవ్ యూ, ప్రేమలో పావని కళ్యాణ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే 2009 వరకు వరుసగా సినిమాలు చేసిన అంకిత.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది.

Ankitha: సింహాద్రిలో ఎన్టీఆర్‏ను ఆటాడుకున్న హీరోయిన్ అంకిత ఎలా మారిందో చూశారా ?.. ఇప్పుడేం చేస్తున్నారంటే..
Ankitha
Rajitha Chanti
|

Updated on: Jan 28, 2023 | 6:35 PM

Share

డైరెక్టర్ రాజమౌళి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో సింహాద్రి ఒకటి. మాస్.. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో భూమిక.. అంకిత కథానాయికలుగా నటించారు. 2003 జూలై 9న విడుదలైన సింహాద్రి సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. దాదాపు రూ. 8.5 కోట్లతో నిర్మించిన ఈ మూవీ దాదాపు రూ. 26 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించగా.. ఈ మూవీలోని సాంగ్స్ కూడా ఎక్కువగానే ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాలో భూమికతోపాటు.. హీరోయిన్ అంకిత కూడా తన నటనతో ఆకట్టుకుంది. ఈ మూవీలోనే కాకుండా..లాహిరి లాహిరి లాహిరిలో.. ధనలక్ష్మి ఐ లవ్ యూ, ప్రేమలో పావని కళ్యాణ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే 2009 వరకు వరుసగా సినిమాలు చేసిన అంకిత.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. ఆమె చివరిసారిగా 2009లో వచ్చిన పోలీస్ అధికారి చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత చిత్రాలకు పూర్తిగా దూరమైంది. ప్రస్తుతం ఆమె ఏం చేస్తుంది ? ఎక్కడుందో తెలుసుకుందమా.

అంకిత.. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అప్పట్లో ఫేమస్ అయిన రస్నా యాడ్ లో నటించి పాపులర్ అయ్యింది. ఆ తర్వాత పలు కమర్షియల్ ప్రకటనలలో నటించింది. ఆ తర్వాత వైవీఎస్ చౌదరి తెరకెక్కించిన లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమైంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దీంతో ఆమెకు తెలుగులో భారీగానే అవకాశాలు వచ్చాయి. అలాగే ఎన్టీఆర్.. జక్కన్న కాంబోలో వచ్చిన సింహాద్రిలోనూ నటించింది.

ఇవి కూడా చదవండి

కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో అంకితకు ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉండేది. అయితే వరుస హిట్స్ అందుకున్న ఆమె.. ఆ తర్వాత మెల్లగా ప్లాపులను కూడా ఖాతాలో వేసుకుంది. దీంతో అవకాశాలు తగ్గాయి. కొన్నాళ్ల తర్వాత పూణెకు చెందిన వ్యాపారవేత్త విశాల్‏ను పెళ్లి చేసుకుంది అంకిత. ఇక అనంతరం సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ప్రస్తుతం ఆమె తన తండ్రికి సంబంధించిన వజ్రాల వ్యాపారాన్ని చూసుకుంటూ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తుంది. అంకిత సోషల్ మీడియాలోనూ చాలా సైలెంట్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.