ఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకల్లో ముక్కామల కళాకారులు
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహించిన శకటాల ప్రదర్శన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన అంబేద్కర్ కోనసీమ జిల్లా ముక్కామల కళాకారుల బృందం తమ అద్భుత ప్రదర్శనతో యావత్ భారతదేశం దృష్టిని ఆకర్షించింది. అంబాజీపేట మండలం ముక్కామలకు చెందిన పసుపులేటి నాగబాబు కళాకారుల బృందం ఈ ఘనత సాధించింది.
దేశ నలుమూలల నుంచి ఎంపికైన దాదాపు 220 మంది కళాకారులతో నిర్వహించిన హెరాల్డింగ్ ప్రోగ్రామ్లో ఆంధ్రప్రదేశ్ తరఫున పసుపులేటి కుమార్ ఆధ్వర్యంలో 20 మంది కళాకారుల బృందం పాల్గొంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో ఈ బృందం చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత సంస్కృతి మంత్రిత్వ శాఖ, సంగీత నాటక అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాదస్వరం, డోలు, తాషా, వీరణం, తప్పెటగుళ్లతో కళాకారులు సంప్రదాయ సంగీతానికి ప్రాణం పోశారు. ప్రేక్షకులతో పాటు ప్రముఖులను కూడా ఈ ప్రదర్శన మంత్రముగ్ధులను చేసింది. కాగా, ఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పసుపులేటి నాగబాబు కళాకారుల బృందం వరుసగా ఈ ఏడాదితో నాలుగోసారి ప్రదర్శన ఇవ్వడం కోనసీమ ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది.
ఇదెక్కడి వాతావరణం.. ఇక్కడేమో ఎండలు.. అక్కడేమో వర్షాలు
రైల్వే ట్రాక్ను కమ్మేసిన పొగ..నిలిచిపోయిన రైలు
ఆ దేశంలో ఆఫీసులు .. స్వర్గానికి స్పాట్లు
వీళ్లు మనుషులేనా.. పెళ్లిలోనే పొట్టు పొట్టు కొట్టుకున్నారు కదా!
గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్.. ముప్పు తప్పదా?
ఏలియన్స్ నిజంగా ఉన్నారా? ఆ సీక్రెట్ ఫైల్స్లో ఏముంది?
ఇంటి బయట నిద్రించిన బాలుడు.. కాటేసిన కట్లపాము, రక్తపింజర.. చివరకు

