ఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకల్లో ముక్కామల కళాకారులు
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహించిన శకటాల ప్రదర్శన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన అంబేద్కర్ కోనసీమ జిల్లా ముక్కామల కళాకారుల బృందం తమ అద్భుత ప్రదర్శనతో యావత్ భారతదేశం దృష్టిని ఆకర్షించింది. అంబాజీపేట మండలం ముక్కామలకు చెందిన పసుపులేటి నాగబాబు కళాకారుల బృందం ఈ ఘనత సాధించింది.
దేశ నలుమూలల నుంచి ఎంపికైన దాదాపు 220 మంది కళాకారులతో నిర్వహించిన హెరాల్డింగ్ ప్రోగ్రామ్లో ఆంధ్రప్రదేశ్ తరఫున పసుపులేటి కుమార్ ఆధ్వర్యంలో 20 మంది కళాకారుల బృందం పాల్గొంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో ఈ బృందం చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత సంస్కృతి మంత్రిత్వ శాఖ, సంగీత నాటక అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాదస్వరం, డోలు, తాషా, వీరణం, తప్పెటగుళ్లతో కళాకారులు సంప్రదాయ సంగీతానికి ప్రాణం పోశారు. ప్రేక్షకులతో పాటు ప్రముఖులను కూడా ఈ ప్రదర్శన మంత్రముగ్ధులను చేసింది. కాగా, ఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పసుపులేటి నాగబాబు కళాకారుల బృందం వరుసగా ఈ ఏడాదితో నాలుగోసారి ప్రదర్శన ఇవ్వడం కోనసీమ ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది.
అలర్ట్..ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేస్తున్నారా?
బాబోయ్.. గుడిలో పాములు..భక్తుల పరుగులు!
పొలం చదును చేస్తుండగా బరువుగా తగిలిన కుండ..లోపల చూడగా ..
గ్రామంలో వింత తీర్మానం.. పోలీసుల పిలుపుతో మారిన సీన్
ప్రియురాలికి ప్రపోజ్ చేయబోతే రింగ్ జారిపడింది.. చివరకు..
మంచు గుప్పిట్లో ఉత్తర కాశ్మీర్..
ధ్వజస్తంభంపై చిలుక..ఎగిరిపోయిందో.. ప్రళయమే!

