AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఇండస్ట్రీలోనే తోపు హీరోయిన్.. 32 సినిమాలు.. కట్ చేస్తే IAS ఆఫీసర్.. ఎవరంటే..

సినీరంగంలో నటిగా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభమేమి కాదు. కానీ ఒకటి రెండు చిత్రాలతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని.. ఆ తర్వాత సినిమాలను వదిలేసింది ఓ నటి. ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఆమె ఐపీఎస్ అధికారి కావాలనుకుంది. దాదాపు 5 సార్లు పరీక్ష రాసి చివరకు ఎట్టకేలకు విజయం సాధించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Tollywood : ఇండస్ట్రీలోనే తోపు హీరోయిన్.. 32 సినిమాలు.. కట్ చేస్తే IAS ఆఫీసర్.. ఎవరంటే..
Keerthana
Rajitha Chanti
|

Updated on: May 18, 2026 | 7:27 PM

Share

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్టుగా అడుగుపెట్టి ఆ తర్వాత నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారు చాలా మంది ఉన్నారు. అయితే సినీరంగంలో తక్కువ సమయంలోనే సక్సెస్ అయ్యి కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే సినిమాలకు దూరమైన తారల గురించి మీకు తెలుసా.. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటి గురించి మీకు తెలుసా.. ? సినిమాల్లో నటిస్తూనే, ఐఏఎస్ కావాలనే ఉద్దేశంతో సినిమాను వదిలి విజయం సాధించింది. ఆమె పెరు కీర్తన. తమిళ చిత్రపరిశ్రమలో ఆమె ఫేమస్ నటి. బాలనటిగా తెరంగేట్రం చేసి ఆ తర్వాత నటిగా మారింది. కర్పూరత కొంపే, గంగా-యమునా, ముత్తిన అలియా, ఉపేంద్ర ఎ, కన్నూర్ హెక్కదాటి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ఓ మల్లికే, లేడీ కమీషనర్, హబ్బా, డోర్, సింహాద్రి వంటి సినిమాల్లో నటించి పాపులర్ అయ్యింది.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆరోజు బాలకృష్ణ చేసిన పని ఇప్పటికీ మర్చిపోలేను.. ఉదయాన్నే 5 గంటల వరకే.. మురళిమోహన్ కామెంట్స్..

ఆమె బాలనటిగా కన్నడ చిత్రసీమలోకి ప్రవేశించింది. అక్కడ కూడా ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె దాదాపు 32 చిత్రాలలో మరియు 48 టెలివిజన్ సీరియల్స్‌లో నటించింది. ఆమె చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధ నటి అవుతుందని అభిమానులు ఆశించారు. కానీ ఆమె 15 ఏళ్ల వయసులోనే సినిమాకు దూరమైంది. కీర్తన భారతదేశపు అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగమైన సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్ అయ్యింది. సినిమా రంగంలో డబ్బు, కీర్తి, పేరు వచ్చినా, తన కల నెరవేరకపోవడంతో కీర్తన ఆ కలను వదులుకుంది. ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ముందు, కీర్తన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం కేఏఎస్ (KAS) పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, రెండు సంవత్సరాల పాటు కేఏఎస్ అధికారిగా పనిచేసింది.

ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu : ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. మాట ఇస్తే నిలబెట్టుకుంటాడు.. జగపతి బాబు..

ఆ తర్వాత కీర్తన యూపీఎస్సీ పరీక్షలపై దృష్టి సారించింది. ఆమె పరీక్షలు రాస్తూనే ఉంది. యూపీఎస్సీ పరీక్షకు సన్నద్ధమవుతూ 5 సార్లు విఫలమైంది. అయినప్పటికీ, ఆమె నిరుత్సాహపడలేదు. ఆమె కష్టపడి చదివి 6వ సారి తన కలను సాకారం చేసుకుంది. 2020లో, కీర్తన సివిల్ సర్వీసెస్ ఆల్ ఇండియా ర్యాంకింగ్స్‌లో 167వ ర్యాంకుతో అర్హత సాధించి ఐఏఎస్ అధికారిణి అయ్యింది. ప్రస్తుతం IAS అధికారిగా విధులు నిర్వహిస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Kajal : నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు.. హీరోయిన్ కాజల్..

Keerthana Ias

Keerthana Ias

ఎక్కువ మంది చదివినవి : Trisha : ఆ హీరోను చూసి చాలా గిల్టీగా ఫీలయ్యా.. అతడంటే చాలా ఇష్టం.. హీరోయిన్ త్రిష కామెంట్స్..

Follow Us
ఇండస్ట్రీలోనే తోపు నటి.. కెరీర్ పీక్స్ లో ఉండగానే..
ఇండస్ట్రీలోనే తోపు నటి.. కెరీర్ పీక్స్ లో ఉండగానే..
పోలీసులకు దొరక్కుండా ఇన్‌స్టాగ్రామ్ కాల్స్,..సీన్ కట్ చేస్తే..
పోలీసులకు దొరక్కుండా ఇన్‌స్టాగ్రామ్ కాల్స్,..సీన్ కట్ చేస్తే..
ఇది రైలా..? పట్టాలపై వెళ్లే విమానమా.. బుల్లెట్ రైలు ఫస్ట్ లుక్ ..
ఇది రైలా..? పట్టాలపై వెళ్లే విమానమా.. బుల్లెట్ రైలు ఫస్ట్ లుక్ ..
కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా జయం రవి రెండో బ్రేకప్
కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా జయం రవి రెండో బ్రేకప్
జిల్లేడు మొక్క గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిన నిజం! శుభమా..
జిల్లేడు మొక్క గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిన నిజం! శుభమా..
నైటీ వేయలేనంటూ ఆ హీరో నా 'మెంటల్ కృష్ణ' సినిమాను రిజెక్ట్ చేశాడు
నైటీ వేయలేనంటూ ఆ హీరో నా 'మెంటల్ కృష్ణ' సినిమాను రిజెక్ట్ చేశాడు
ఆధార్ కార్డు వినియోగదారులకు శుభవార్త.. ఉచితంగా..
ఆధార్ కార్డు వినియోగదారులకు శుభవార్త.. ఉచితంగా..
జాన్వీ కపూర్‌ కెరీర్‌కు కీలకంగా మారిన పెద్ది సక్సెస్
జాన్వీ కపూర్‌ కెరీర్‌కు కీలకంగా మారిన పెద్ది సక్సెస్
చెపాక్‌లో ‘టాస్’ గెలిచిన చెన్నై.. మరోసారి హ్యాండిచ్చిన ధోని..!
చెపాక్‌లో ‘టాస్’ గెలిచిన చెన్నై.. మరోసారి హ్యాండిచ్చిన ధోని..!
పోలీసులను చూసి తప్పించుకుందాం అనుకున్నాడు.. చివరకు ఏం జరిగిందంటే
పోలీసులను చూసి తప్పించుకుందాం అనుకున్నాడు.. చివరకు ఏం జరిగిందంటే