ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్న రాధికా .. ఇంకెన్నాళ్లో.. 

Rajeev 

18 May  2026

instagram

అందాల భామ నేహా శెట్టి క్రేజ్ పెంచేసింది ఒకే ఒక్క సినిమా అది డీజే టిల్లు. మెహబూబా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నటించిన మోహబూబా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ నేహాకు తెలుగులో అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ సరసన డీజే టెల్లు సినిమాతో హిట్టుకొట్టింది. 

ఇందులో ఆమె నటించిన రాధిక పాత్ర యూత్ లో ఎంతగా వైరల్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఆ తర్వాత తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటించింది. 

దీంతో మెల్లగా ఇండస్ట్రీలో ఆఫర్స్ తగ్గిపోయాయి. చాలా కాలంగా నేహా శెట్టి ఒక్క సినిమా కూడా చేయలేదు.

కానీ ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. కానీ ఈ అమ్మడు బ్యాడ్ లక్ అక్కడ సైతం వెంటపడింది.

ప్రస్తుతం తెలుగులో సరైన అవకాశాల కోసం ఎదురుచూచ్తుంది. అలాగే సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తుంది.