AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మబాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సింహాద్రి హీరోయిన్

దేశవ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్టీఆర్ అభిమానులు థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు. భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి హంగామా చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.

అమ్మబాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సింహాద్రి హీరోయిన్
Simhadri
Rajeev Rayala
|

Updated on: Sep 27, 2024 | 12:55 PM

Share

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన  దేవర సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అభిమానులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్స్ లోకి వచ్చేసింది. ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్టీఆర్ అభిమానులు థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు. భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి హంగామా చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. తొలి రోజే దేవర సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తుంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో సూపర్ హిట్ మూవీ సింహాద్రి సినిమా ఒకటి. ఆది సినిమా తర్వాత సింహాద్రి సినిమా మాస్ ఆడియన్స్ కు ఎన్టీఆర్ ను మరింత దగ్గర చేసింది. సింహాద్రి సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ మరింత డబుల్ అయ్యింది.

ఇది కూడా చదవండి :Geetha Govindam: వాయమ్మో..! ఈ చిన్నది గీతగోవిందంలో చేసిందా..! ఎంత మారిపోయింది

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించారు. ఎన్టీఆర్ జోడిగా భూమిక, అంకితనటించారు. వీరిలో అంకిత తన అందాలతో ప్రేక్షకులను మెప్పించింది. ఇంతకూ ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉంది. సినిమా ఇండస్ట్రీకి దూరం అయిన తర్వాత ఏం చేస్తుంది.?

ఇది కూడా చదవండి :Ranam : రణం బ్యూటీ రచ్చ రంబోలా..! ఈ ముద్దుగుమ్మ ఎంతలా మారిపోయింది.!!

అంకిత చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించింది ఈ భామ, రస్నా యాడ్ లో నటించిన ఈ చిన్నది ఆతర్వాత రస్నా బేబీగా మారిపోయింది. లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తర్వాత సింహాద్రి సినిమాలో చేసింది. విజయేంద్రవర్మ, సీతారాముడు,అనసూయ, వినాయకుడు సినిమాలు చేసింది. కానీ ఆతర్వాత ఊహించని విధంగా సినిమాలకు దూరం అయ్యింది. ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉంది అని చాలా మంది గూగుల్ లో గాలిస్తున్నారు. అంకిత సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండదు ఆమెకు సంబందించిన లేటెస్ట్ ఫోటోలు కూడా గూగుల్ లో తక్కువే ఉన్నాయి. ఉన్నవాటిలో కొన్ని లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో అంకితను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. చాలా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Ankhitha

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us