AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tripti Dimri: త్రిప్తి రెమ్యునరేషన్ అంత తక్కువా ?.. ‘యానిమల్’ సినిమాకు జోయా ఎంత తీసుకుందో తెలుసా..

ఇందులో రష్మిక మందన్న కథానాయికగా నటించినప్పటికీ ఆమె కంటే త్రిప్తి దిమ్రీనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఎందుకంటే ఆయన పోషించిన పాత్ర అలాంటిది. గెస్ట్ అప్పియరెన్స్ అయినా సెన్సేషనల్ టాక్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో నటించినందుకు త్రిప్తి ఎక్కువగా రెమ్యునరేషన్ తీసుకుందంటూ ప్రచారం నడిచింది. కానీ అసలు ఎంత తీసుకుంది అనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు.. కానీ ఇప్పుడు త్రిప్తి రెమ్యునరేషన్ విషయం ఫిల్మ్ సర్కిల్లో వైరలవుతుంది.

Tripti Dimri: త్రిప్తి రెమ్యునరేషన్ అంత తక్కువా ?.. 'యానిమల్' సినిమాకు జోయా ఎంత తీసుకుందో తెలుసా..
Triptii Dimri
Rajitha Chanti
|

Updated on: Mar 14, 2024 | 7:38 AM

Share

విమర్శలు ఎన్నొచ్చిన పాన్ ఇండియా బాక్సాఫీస్‏ను షేక్ చేసిన సినిమా యానిమల్. ఈ మూవీ అత్యధిక వసూళ్లు రాబట్టింది. డైరెక్టర్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి అన్ని వర్గాల అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తండ్రి ప్రేమ కోసం ఆరాటపడే కొడుకు కథే ఈ చిత్రం. ఇందులో అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి డిమ్రి కీలకపాత్రలు పోషించారు. అయితే ఈ మూవీతో త్రిప్తి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇందులో రష్మిక మందన్న కథానాయికగా నటించినప్పటికీ ఆమె కంటే త్రిప్తి దిమ్రీనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఎందుకంటే ఆయన పోషించిన పాత్ర అలాంటిది. గెస్ట్ అప్పియరెన్స్ అయినా సెన్సేషనల్ టాక్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో నటించినందుకు త్రిప్తి ఎక్కువగా రెమ్యునరేషన్ తీసుకుందంటూ ప్రచారం నడిచింది. కానీ అసలు ఎంత తీసుకుంది అనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు.. కానీ ఇప్పుడు త్రిప్తి రెమ్యునరేషన్ విషయం ఫిల్మ్ సర్కిల్లో వైరలవుతుంది. నివేదికల ప్రకారం యానిమల్ సినిమా కోసం త్రిప్తి రూ. 40 లక్షలు పారితోషికం తీసుకుందట.

యానిమల్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించిన త్రిప్తి జోయాగా గ్లామరస్‏గా కనిపించింది. ముఖ్యంగా ఈ సినిమాలో ఆమె కనిపించిన బోల్డ్ సీన్స్‏తో ఒక్కసారిగా పాపులారిటీ పెరిగింది. దీంతో త్రిప్తి గురించి సోషల్ మీడియాలో సెర్చింగ్ స్టా్ర్ట్ చేశారు. ఈ మూవీ తర్వాత త్రిప్తికి బాలీవుడ్ లో అవకాశాలు క్యూ కట్టాయి. ఇప్పుడు ఆమెను వెతుక్కుంటూ ఆఫర్స్ వస్తున్నాయి. భూల్ భూలయ్య 3, ఆషికీ 3 వంటి చిత్రాల్లో నటించింది.

ఎన్నో ఏళ్లుగా రంగుల ప్రపంచంలో ఉన్న త్రిప్తి దిమ్రీ కొన్ని సినిమాల్లో నటించింది. ‘బుల్ బుల్’, ‘కాలా’ వంటి సినిమాల్లో నటించినా.. ‘యానిమల్’ సినిమాతోనే బాగా ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం ఆమె ఇన్ ఫాలోవర్స్ సంఖ్య 50 లక్షలకు చేరుకుంది. యానిమల్ సినిమా ఇప్పుడు బుల్లితెరపైకి రానుంది. మార్చి 17న ఈ సినిమా రాత్రి 7 గంటలకు సోనీ మ్యాక్స్ ఛానెల్ లో ప్రసారం కానుంది.

View this post on Instagram

A post shared by VOGUE India (@vogueindia)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.