Bigg Boss 7 Telugu: కన్నీళ్లు పెట్టించిన లెటర్స్.. ఎక్కెక్కి ఏడ్చిన అమర్ దీప్, పల్లవి ప్రశాంత్

హౌస్ లో ప్రస్తుతం పదిమంది ఉన్నారు. ప్రిన్స్ యావర్-తేజా, శుభశ్రీ-గౌతమ్, శివాజీ-ప్రశాంత్, అమర్ దీప్-సందీప్‌, శోభా శెట్టి- ప్రియాంకా జంటలుగా ఉన్నారు. వీరి మధ్య రకరకాల టాస్క్ లు ఇస్తూ గేమ్స్ ఆడిస్తున్నారు బిగ్ బాస్. ఇక నిన్నటి ఎపిసోడ్ లో శోభా శెట్టి- ప్రియాంకా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు. దాంతో నాలుగు జంటలను ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా నాలుగు జంటలను తమ కుటుంబసభ్యుల నుంచి వచ్చిన లెటర్స్ ని ఇచ్చాడు కానీ..

Bigg Boss 7 Telugu: కన్నీళ్లు పెట్టించిన లెటర్స్.. ఎక్కెక్కి ఏడ్చిన అమర్ దీప్, పల్లవి ప్రశాంత్
Bigg Boss 7 Telugu Promo
Follow us

|

Updated on: Oct 06, 2023 | 10:35 AM

బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు ఎమోషనల్ ఎపిసోడ్ నడుస్తోంది. నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ లో ఉన్న వారికీ బిగ్ బాస్ ఓ ఎమోషనల్ టాస్క్ ఇచ్చాడు. బిగ్ బాస్ లో ఉన్న వారిని జంటలుగా చేశాడు బిగ్ బాస్. హౌస్ లో ప్రస్తుతం పదిమంది ఉన్నారు. ప్రిన్స్ యావర్-తేజా, శుభశ్రీ-గౌతమ్, శివాజీ-ప్రశాంత్, అమర్ దీప్-సందీప్‌, శోభా శెట్టి- ప్రియాంకా జంటలుగా ఉన్నారు. వీరి మధ్య రకరకాల టాస్క్ లు ఇస్తూ గేమ్స్ ఆడిస్తున్నారు బిగ్ బాస్. ఇక నిన్నటి ఎపిసోడ్ లో శోభా శెట్టి- ప్రియాంకా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు. దాంతో నాలుగు జంటలను ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా నాలుగు జంటలను తమ కుటుంబసభ్యుల నుంచి వచ్చిన లెటర్స్ ని ఇచ్చాడు కానీ జంటలో ఒకరు మాత్రమే లెటర్ చదవాలని మరొకరు ఆ లెటర్ ను త్యాగం చేయాలని చెప్పాడు.

దాంతో హౌస్ మొత్తం ఎమోషన్స్ తో నిండిపోయింది. నిన్నటి ఎపిసోడ్ లో శుభ శ్రీ గౌతమ్ కోసం త్యాగం చేసింది. దాంతో తన తండ్రి రాసిన లెటర్ చూసి ఎమోషనల్ అయ్యాడు గౌతమ్. అలాగే యావర్ తేజ కోడం త్యాగం చేశాడు. తన తండ్రి రాసిన లెటర్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు తేజ. ఇక నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.

ఈ ప్రోమోలో అమర్ దీప్ , సందీప్ మాస్టర్, ప్రశాంత్, శివాజీ మాత్రమే కనిపించారు. సందీప్ కోసం అమర్ దీప్ తన లెటర్ ను త్యాగం చేశాడు. అయితే తన భార్య ను తలుచుకొని ఎమోషనల్ అయ్యాడు అమర్ దీప్. అమర్ దీప్ కు ఇటీవలే పెళ్లైన విషయం తెలిసిందే. బిగ్ బాస్ కు వచ్చిన తర్వాతే తనకు భార్య విలువ తెలిసింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. సందీప్ మాస్టర్ తన అమ్మ ఆరోగ్యం కోసం లెటర్ చదవాలని అని కోరగా అమర్ తన లెటర్ ను త్యాగం చేశాడు. అటు శివాజీ కూడా ప్రశాంత్ కోసం తన లెటర్ ను త్యాగం చేశాడు. తన భార్య తనను అర్ధం చేసుకుంటుందని కాస్త ఎమోషనల్ అయ్యాడు శివాజీ. ప్రశాంత్ శివాజీని పట్టుకొని ఎక్కి ఎక్కి ఇచ్చేశాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.