AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 6 Telugu: బిగ్‏బాస్ షోకు షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. నాగార్జునతోపాటు వారి కూడా నోటీసులు జారీ..

తాజాగా బిగ్ బాస్ విషయంలో ఓ స్పష్టమైన నిర్ణయాన్ని వచ్చింది ఏపీ కోర్టు. పిటిషన్ దారుని వాదనతో పూర్తిగా ఏకీభవించింది. ఈ క్రమంలోనే ఈ షో నిర్వాహకులకు నోటీసులిచ్చింది.

Bigg Boss 6 Telugu: బిగ్‏బాస్ షోకు షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. నాగార్జునతోపాటు వారి కూడా నోటీసులు జారీ..
Bigg Boss 6 Telugu, Highcou
Rajitha Chanti
|

Updated on: Oct 27, 2022 | 6:38 PM

Share

సీజన్ 6తో హ్యాపీగా సాగుతున్న బిగ్‌ బాస్ జర్నీకి బిగ్ షాక్ తగిలింది. ఏపీ హైకోర్టు తాజాగా ఈ షోకు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చింది. ఈ షో మేకర్స్ తో పాటు.. కింగ్ నాగార్జునకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తాజాగా నోటీసులిచ్చింది. ఇదే న్యూస్ తో ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ షో అశ్లీలతకు.. కేరాఫ్‌గా ఉందని.. యూత్‌ను పెడదోవ పట్టిస్తోందని ఎప్పటి నుంచో.. పేరున్న నేతలు కొంత మంది ఆరోపిస్తున్నారు. దీన్ని బ్యాన్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ బిగ్ బాస్ షోకు వ్యతిరేకంగా పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. కోర్టులో పిటిషన్లు కూడా ఇచ్చారు. కానీ తాజాగా తెలుగు యువశక్తి అధ్యక్షుడు, సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఈ దిశగా… కాస్త సక్సెస్ అయినట్లుగా తెలుస్తోంది.

ఇటీవల ఈయన ఈ షోపై ఏపీ హైకోర్టులో ప్రజ ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. అయితే దీన్ని విచారించిన కోర్టు.. రెండు మూడు రోజుల కిందట అందరూ షాకయ్యేలా మాట్లాడింది. బిగ్‌ బాస్‌ పై తీవ్ర అభ్యంతరాలు ఎందుకు వ్యక్తం అవుతున్నాయో తెలుసుకునేందుకు రెండు మూడు ఎపిసోడ్స్‌ చూస్తామని చెప్పింది. ఎలాంటి సెన్సార్‌ షిప్ లేకుండా … షో టెలీకాస్ట్ చేస్తున్నారన్న పిటిషన్ దారుని ఆరోపణతో.. ఈ షో పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలను కూడా అప్పుడే ఆదేశించింది. వీటన్నింటినీ పరిశీలించాకే తీర్పు ఇస్తామంటూ.. పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఇక చెప్పినట్టే… తాజాగా బిగ్ బాస్ విషయంలో ఓ స్పష్టమైన నిర్ణయాన్ని వచ్చింది ఏపీ కోర్టు. పిటిషన్ దారుని వాదనతో పూర్తిగా ఏకీభవించింది. ఈ క్రమంలోనే ఈ షో నిర్వాహకులకు నోటీసులిచ్చింది. దాంతో పాటే … ఈ షో హాస్ట్ కింగ్ నాగార్డునకు… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా నోటీసులు పంపింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం ఈ పిటిషన్ పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.