AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: ఐదేళ్లలో విదేశాల్లో లగ్జరీ ఇళ్లు కొన్న రష్మిక.. హీరోయిన్ రియాక్షన్ ఏంటంటే..

హైదరాబాద్, కూర్గ, బెంగుళూరు, గోవా, ముంబై నగరాల్లో రష్మికకు ఖరీదైన అపార్ట్ మెంట్స్ ఉన్నాయంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా వీటన్నింటి పై రియాక్ట్ అయ్యింది రష్మిక.

Rashmika Mandanna: ఐదేళ్లలో విదేశాల్లో లగ్జరీ ఇళ్లు కొన్న రష్మిక.. హీరోయిన్ రియాక్షన్ ఏంటంటే..
Rashmika Mandanna
Rajitha Chanti
|

Updated on: Feb 11, 2023 | 3:01 PM

Share

కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస హిట్స్‏తో ఫుల్ జోష్ మీదున్నది. డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన కిరిక్ పార్టీ సినిమాతో కెరీర్ ఆరంభించిన ఈ చిన్నది… తక్కువ సమయంలోనే తెలుగుతోపాటు.. తమిళం… హిందీలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా పుష్ప సినిమాతో ఒక్కసారిగా ఈ అమ్మడు క్రేజ్ మారిపోయింది. అయితే కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఐదేళ్లలో రష్మిక దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏకంగా ఐదు ఇళ్లు కొనేశారన్న వార్త ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరలవుతుంది. అంతేకాదు… తన సంపాదనలో ఎక్కువ శాతం ప్రాపర్టీస్ పై ఇన్వెస్ట్ చేస్తోందని.. ఇందులో భాగంగానే హైదరాబాద్, కూర్గ, బెంగుళూరు, గోవా, ముంబై నగరాల్లో రష్మికకు ఖరీదైన అపార్ట్ మెంట్స్ ఉన్నాయంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా వీటన్నింటి పై రియాక్ట్ అయ్యింది రష్మిక. తన గురించి వస్తున్న రూమర్స్ అన్ని అవాస్తవాలే అంటూ చెప్పుకొచ్చింది.

తన గురించి వస్తున్న రూమర్సా్ అన్ని నిజమైతే బాగుండు అంటూ కామెంట్ చేసింది రష్మిక. ఇక నేషనల్ క్రష్‏కు నెటిజన్స్ సైతం మద్దతు తెలుపుతున్నారు. ఈ ఏడాది రష్మిక వారిసు.. మిషన్ మజ్నూ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ సరసన యానిమల్ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాకు అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.