AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood News: లేటెస్ట్ అప్‌డేట్స్ ప్లీజ్.. కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న స్టార్ హీరోల ఫ్యాన్స్

టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు ఒకేసారి మూడు నాలుగు సినిమాలకు కమిటై.. ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా షూటింగ్ చేస్తున్నారు.

Tollywood News: లేటెస్ట్ అప్‌డేట్స్ ప్లీజ్.. కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న స్టార్ హీరోల ఫ్యాన్స్
Representative Image
Janardhan Veluru
|

Updated on: Jul 07, 2022 | 6:01 PM

Share

Tollywood News Updates: తమ ఫ్యావరెట్ హీరోలు ఏం చేస్తున్నారనే విషయంపై వారి ఫ్యాన్స్ ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. షూటింగ్స్‌లో ఉంటే ఫస్ట్ లుక్ ఎప్పుడని ఎదురుచూస్తారు.  ఖాళీగా ఉంటే కొత్త సినిమా ఎప్పుడంటారు? లేటెస్ట్ అప్‌డేట్ ప్లీజ్ అంటూ  సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తారు. తాజాగా మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇదే డైలమాలో ఉన్నారు. వాళ్ళ గత సినిమాలు విడుదలై చాలా నెలలైనా.. ఇప్పటికీ ఖాళీగానే ఉన్నారు. మరి వీళ్ళ కొత్త సినిమాలకు ముహూర్తం ఎప్పుడు..? టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు ఒకేసారి మూడు నాలుగు సినిమాలకు కమిటై.. ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా షూటింగ్ చేస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం ఒక్క సినిమాకే కమిటైనా.. దాన్ని మొదలుపెట్టడానికి చాలా సమయం తీసుకుంటున్నారు.

మొదటి జాబితాలో చిరంజీవి, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు వస్తే.. రెండో జాబితాలోకి మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వస్తారు. ఈ ముగ్గురి కొత్త సినిమాల షూటింగ్ అప్‌డేట్స్‌ కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా వేచి చూస్తున్నారు. పుష్ప సినిమా విడుదలై ఆర్నెళ్ళు దాటినా.. ఇంకా  పార్ట్ 2 (Pushpa 2) షూటింగ్ మొదలుపెట్టలేదు బన్నీ. ఇప్పుడు అప్పుడూ అంటున్నా.. ఆ అప్పుడు ఎప్పుడో అభిమానులకు అర్థం కావట్లేదు. సుకుమార్ ఇంకా ఈ స్క్రిప్టుకు మెరుగులు దిద్దుతూనే ఉన్నారు. ప్రస్తుతం బన్నీ కుటుంబంతో పాటు టాంజానియాలో ఉన్నారు. అక్కడి సెరంగేటి నేషనల్ పార్క్‌లో భార్యా పిల్లలతో ఉన్న అల్లు అర్జున్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పుష్ప 2 సెప్టెంబర్‌లో మొదలు కావచ్చన్న టాక్ వినిపిస్తోంది.

మహేష్ బాబు(Mahesh Babu) సైతం త్రివిక్రమ్ సినిమాకు కమిటైనా.. రెగ్యులర్ షూటింగ్‌పై అప్‌డేట్ ఇవ్వలేదు. సర్కారు వారి పాట తర్వాత నెల రోజులకు పైగానే బ్రేక్ తీసుకున్నారు మహేష్. ఫారెన్ నుంచి ఈ మధ్యే వచ్చిన సూపర్ స్టార్.. త్రివిక్రమ్‌ను కలిసినట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు కానుందో మరికొన్ని రోజుల్లో తేలనుంది. అతడు, ఖలేజా తర్వాత త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్‌లో రానున్న సినిమా కావడంతో.. స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం కొరటాల శివతో అతడి ప్రాజెక్ట్ కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు. ఆగస్ట్ నుంచి ఈ చిత్రం పట్టాలెక్కేలా కనిపిస్తుంది కానీ దీనిపై క్లారిటీ అయితే రాలేదు. కొరటాల మూవీ కోసం బరువు తగ్గుతున్నారు తారక్. ఈ సారి సందేశాలు పక్కనబెట్టి.. పక్కా మాస్ సినిమాతో వస్తున్నారు కొరటాల శివ. మోషన్ పోస్టర్‌తోనే ఈ మ్యాటర్ అర్థమైపోయింది.

మొత్తానికి మహేష్ బాబు, బన్నీ, ఎన్టీఆర్.. తమ కొత్త సినిమాలపై అభిమానులకు గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తారో..? మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..

మరిన్ని సినిమా వార్తలు చదవండి..