Mega Young Heroes: చిన్నతనం నుంచి ఏమీ మారలేదంటూ మెగా యంగ్ హీరోల సెల్ఫీ .. సోషల్ మీడియాలో వైరల్ ..

Mega Young Heroes: సినీ పరిశ్రమలో ఎవరి అండగా లేకుండా స్వయం శక్తితో ఎదిగిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయన వేసిన రోడ్డుపై దాదాపు మెగా హీరోలు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి బ్యాక్ గ్రౌండ్ తో..

Mega Young Heroes: చిన్నతనం నుంచి ఏమీ మారలేదంటూ మెగా యంగ్ హీరోల సెల్ఫీ .. సోషల్ మీడియాలో వైరల్ ..
Mega Young Heroes
Follow us

|

Updated on: Jun 28, 2021 | 11:32 AM

Mega Young Heroes: సినీ పరిశ్రమలో ఎవరి అండగా లేకుండా స్వయం శక్తితో ఎదిగిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయన వేసిన రోడ్డుపై దాదాపు మెగా హీరోలు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినా తమకంటూ ఓ ప్రత్యేక శైలితో సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. రోజు రోజుకీ మెగా హీరో అభిమానుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఇక మెగా ఫ్యామిలీ కి సంబంధించిన ఏ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా అవి వైరల్ అవుతాయి.. తాజాగా యంగ్ హీరోలున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మెగా తనయుడు  వరుణ్ తేజ్ తన కజిన్స్ తో దిగిన సెల్ఫీ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

సాయి ధరమ్ తేజ్ ఓ ఫోటోనీ సోషల్ మీడియాలో ఫొటో పోస్ట్ చేసిన .. చిన్నతనం నుంచి కొన్ని ఏ మాత్రం మారలేదని ఓ క్యాప్షన్ ఇచ్చాడు. వైష్ణవ్ తేజ్ గాడ నిద్రలో ఉండగా వరుణ్ తేజ్ ఒక కన్ను తెరచి సెల్ఫీకి స్టిల్ ఇచ్చాడు. ఇక వారి ఫొటోను చూసి నిహారిక ఇన్స్టాగ్రామ్ లో పక్కున నవ్వేసినట్లు కామెంట్ చేసింది. ఇక ఆ ఫొటో క్షణాల్లోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

చిరంజీవి వారసుడిగా మొదటగా వెండి తెరపై అడుగు పెట్టింది పవన్ కళ్యాణ్. దీంతో మెగా ఫ్యామిలీ క్రేజ్ మరింత పెరిగింది. తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ , వైష్ణవ తేజ్ లు ఎంట్రీ ఇచ్చారు.. డిఫరెంట్ మూవీస్ తో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇటీవలే మెగా బ్రదర్ తనయ నీహారిక పెళ్లి నిర్వహించారు.. ఇక మెగా ఫ్యామిలీ నుంచి ముగ్గురు యంగ్ హీరోలు పెళ్ళికి రెడీగా ఉన్నారు. సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ , వైష్ణవ్ తేజ్. ముగ్గురు పెళ్ళికి రెడీగా ఉన్నారు. ఇప్పటికే సాయికి, వరుణ్ కి పెళ్ళిసంబంధాల వేటలో ఉన్నారనే వార్తలు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ముగ్గురు హీరోలు చిన్నప్పటి నుంచి ఒక గ్యాంగ్ లా ఉంటారట. ఫ్యామిలీ పండగ, పంక్షన్ ఏదైనా సరే ఈ ముగ్గురు కలిసి చేసే అల్లరికి, సందడికి హద్దే ఉండదు.. ఇక వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ లు లకు నీహారిక జత కలిస్తే.. అప్పుడు అక్కడ రచ్చ రచ్చే.. అని చెప్పవచ్చు. ఇక చిన్నప్పటి నుంచి కూడా ఈ ముగ్గురు హీరోలు ఒక్కటే కంచం ఒక్కటే మంచం అనేలా పేరిగినట్లు తెలుస్తోంది.

Also Read:  ఒకప్పుడు అఖండ భారతావనిలోని ఆప్ఘనిస్థాన్ లో శివుడిపేరుతో సరస్సు..