మరోసారి ఎన్టీఆర్తో జత కట్టనున్న శృుతి హాసన్?
కమల్ హాసన్ కూతురిగా సినీ రంగ ప్రవేశం చేసినా.. నటనలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది శృుతి హాసన్. కొన్నేళ్లుగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటోన్న శ్రుతి.. తాజాగా తారక్ నటించబోయే సినిమాలో హీరోయిన్గా..
కమల్ హాసన్ కూతురిగా సినీ రంగ ప్రవేశం చేసినా.. నటనలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది శృుతి హాసన్. కొన్నేళ్లుగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటోన్న శ్రుతి.. తాజాగా తారక్ నటించబోయే సినిమాలో హీరోయిన్గా కనిపించబోతుందని సమాచారం. యంగ్ టైగర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ల కాంబినేషన్లో త్వరలోనే ఓ చిత్రం పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమాకు సంబంధించిన స్క్రిప్టును పూర్తి చేసే పనిలో ఉన్నారు డైరెక్టర్ త్రివిక్రమ్. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరిని తీసుకుంటారనే విషయంపై పలు చర్చలు జరుగుతున్నాయి.
కాగా ఇప్పటికే త్రివిక్రమ్ సినిమాలో స్టైలిష్ బిజినెస్మెన్ లుక్లో తారక్ కనిపించనున్నాడని టాలీవుడ్లో ప్రచారం సాగుతోంది. దీంతో ఇద్దరి భామలతో ఎన్టీఆర్ చిందేసే అవకాశముందని మరో ప్రచారం జరుగుతోంది. వీరిలో శ్రుతి ఒకరని వార్తలొస్తున్నాయి. అలాగే మరో హీరోయిన్ పాత్రలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్, పూజా హెగ్డే పేర్లు వినిపిస్తున్నాయి. కాగా గతంలో ఎన్టీఆర్తో శ్రుతి హాసన్ ‘రామయ్య వస్తావయ్యా’ అనే సినిమాలో నటించారు. కానీ ఆ సినిమా అంత పెద్దగా హిట్ కాలేదు. ఇక వీరిలో ఎవరెవర్ని తీసుకుంటారో అని పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. కాగా ప్రస్తుతం తారక్ ఆర్ఆర్ఆర్లో నటిస్తున్నాడు. లాక్డౌన్ కారణంగా ఆ సినిమా షూటింగ్కి బ్రేకులు పడ్డాయి.
Read More:
తెలంగాణలో ఇకపై ఆ పేర్లు ఉండవ్.. కేసీఆర్ కీలక నిర్ణయం
లాక్డౌన్ ఫ్రస్ట్రేషన్ తెలిపితే.. డబ్బులే డబ్బులు!
అక్షయ తృతీయ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయితో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు!