AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్ ఫ్యాన్స్‌ను మళ్లీ నిరాశపర్చిన జక్కన్న..!

మహేష్ బాబు- రాజమౌళి.. ఈ కాంబినేషన్ కోసం టాలీవుడ్ మొత్తం ఎప్పటినుంచో ఎదురుచూస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్లో మూవీ వస్తే రికార్డులు బ్రేక్ అవుతాయని సినీ పండితులు కూడా ఎప్పటి నుంచో తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇక మహేష్‌తో సినిమాపై ఓ సందర్భంలో మాట్లాడిన రాజమౌళి సైతం.. సూపర్‌స్టార్‌తో తన సినిమా కచ్చితంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ మూవీ తరువాత అయినా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుందని అందరూ భావించారు. కానీ ఈ […]

మహేష్ ఫ్యాన్స్‌ను మళ్లీ నిరాశపర్చిన జక్కన్న..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 31, 2019 | 7:40 PM

Share

మహేష్ బాబు- రాజమౌళి.. ఈ కాంబినేషన్ కోసం టాలీవుడ్ మొత్తం ఎప్పటినుంచో ఎదురుచూస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్లో మూవీ వస్తే రికార్డులు బ్రేక్ అవుతాయని సినీ పండితులు కూడా ఎప్పటి నుంచో తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇక మహేష్‌తో సినిమాపై ఓ సందర్భంలో మాట్లాడిన రాజమౌళి సైతం.. సూపర్‌స్టార్‌తో తన సినిమా కచ్చితంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ మూవీ తరువాత అయినా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుందని అందరూ భావించారు. కానీ ఈ సారి కూడా అందరి ఆశలపై నీళ్లు చల్లారు జక్కన్న.

మహేష్‌తో మూవీ ఇప్పట్లో లేదని చెప్పకనే చెప్పారు రాజమౌళి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దర్శకధీరుడు.. ‘‘మహేష్‌కు సరిపోయే స్క్రిప్ట్‌ సిద్ధంగా ఉన్నప్పుడే అతడిని కలుస్తాను. ఇందులో అంత తొందరేం లేదు’’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో మహేష్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు లోనయ్యారు. వీరిద్దరి కాంబినేషన్లో ఎప్పుడు సినిమా వస్తుందో అంటూ వారు ఇక ఇదే ఇంటర్వ్యూలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంపై కూడా రాజమౌళి స్పందించారు. ‘‘అదేం పుకారు కాదు. నేను కచ్చితంగా మహాభారతాన్ని తెరకెక్కిస్తా. కానీ అది సెట్స్ మీదకు ఎప్పుడు వెళ్తుంది అని మాత్రం చెప్పలేను’’ అని రాజమౌళి చెప్పుకొచ్చారు. కాగా ఓ సినిమా తీసే సమయంలో తన తదుపరి మూవీ గురించి రాజమౌళి ఇంతవరకు ఎప్పుడూ ప్రస్తావించలేదు.

కాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ తరువాత తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. అయితే మహేష్ బాబుతో సినిమా తీసేందుకు వంశీ పైడిపల్లి, పరశురామ్, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తదితరులు లైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సరిలేరు నీకెవ్వరు తరువాత దాదాపు మూడు నెలల పాటు గ్యాప్‌ తీసుకోనున్న మహేష్.. అప్పుడు ఫ్యామిలీకి సమయాన్ని కేటాయించబోతున్నట్లు నమ్రత ఓ సందర్భంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక మరోవైపు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.