‘బాబా ఈజ్‌ బ్యాక్’‌.. షూటింగ్‌కి రెడీ అవుతున్న ‘అధీర’

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న కేజీఎఫ్‌ 2లో బాలీవుడ్‌ నటుడు సంజయ్ దత్ విలన్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే.

'బాబా ఈజ్‌ బ్యాక్'‌.. షూటింగ్‌కి రెడీ అవుతున్న 'అధీర'
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 16, 2020 | 4:51 PM

Sanjay Dutt Adheera: యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న కేజీఎఫ్‌ 2లో బాలీవుడ్‌ నటుడు సంజయ్ దత్ విలన్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల సంజయ్ దత్‌కి క్యాన్సర్ అని తేలడంతో.. చికిత్స నిమిత్తం విదేశాలకు వెళ్లారు. కాగా ఈ మధ్యలో సంజయ్‌ ఆరోగ్యంపై ఎన్నో వార్తలు వచ్చాయి. ఆయన ఆరోగ్యం విషమించిందని, చాలా బరువు తగ్గారని రకరకాల పుకార్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇటీవల మరో వార్త కూడా ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొట్టింది. సంజయ్ రాకపోతే ఆ స్థానంలో డూప్‌ని పెట్టి షూటింగ్ చేసేందుకు కేజీఎఫ్ 2 టీమ్ రెడీ అయ్యిందని మరో పుకారు షికారు చేసింది.

అయితే వాటన్నింటికి చెక్ పెడుతూ బాబా బ్యాక్ వచ్చేశారు. అధీర కోసం సంజయ్ ప్రస్తుతం రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని సంజయ్ సోషల్ మీడియాలో వెల్లడించారు. అధీర కోసం రెడీ అవుతున్నా అని ఈ నటుడు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఇక నవంబర్ నుంచి సంజయ్‌.. కేజీఎఫ్‌ 2 షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. కాగా కేజీఎఫ్‌ సీక్వెల్‌గా తెరకెక్కబోతున్న ఈ మూవీ పాన్ ఇండియాగా విడుదల కానుంది. ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

Read More:

షాకింగ్ న్యూస్.. రెమెడిసివర్‌పై డబ్ల్యూహెచ్‌ఓ సంచలన విషయాలు

అగ్నిప్రమాదంపై స్పందించిన నాగార్జున