షాకింగ్ న్యూస్.. రెమెడిసివర్పై డబ్ల్యూహెచ్ఓ సంచలన విషయాలు
కరోనా చికిత్సలో భాగంగా అత్యధికంగా వినియోగిస్తోన్న ఔషదం రెమెడిసివర్. కరోనాకు సంబంధించి ఇంతవరకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోగా
WHO on Remdesivir: కరోనా చికిత్సలో భాగంగా అత్యధికంగా వినియోగిస్తోన్న ఔషదం రెమెడిసివర్. కరోనాకు సంబంధించి ఇంతవరకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోగా.. కరోనా లక్షణాలు మధ్యస్థంగా ఉన్నవారిలో ఆ లక్షణాలు మరింత తీవ్రం అవ్వకుండా వైద్యులు ఈ యాంటీ వైరల్ డ్రగ్ని వాడుతున్నారు. అంతేకాదు కరోనా చికిత్సలో ఇదే ప్రాణాధారమైన మందు అని ప్రచారం జరిగింది. దీంతో రూ.5,400కి లభ్యమయ్యే ఈ ఇంజక్షన్ని కొంతమంది బ్లాకులో రూ.30 వేల వరకు కూడా అమ్ముకున్న సందర్భాలున్నాయి. ఇక ఇటీవల కరోనా బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ ఔషధాన్ని వినియోగించారు.
అయితే ఈ మెడిసిన్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనిపై డబ్ల్యూహెచ్ఓ ఇటీవల అధ్యయనం చేయగా.. 30 దేశాల్లోని 11,266 మంది రోగులకు అందించారు. ఈ మెడిసిన్తో అనుకున్న మేర ప్రయోజనాలేవీ కనిపించడంలేదని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. కరోనా రోగులు కోలుకోవడం, వారిని ప్రాణాపాయం నుంచి బయటపడేసే అంశాలపై ఈ మెడిసిన్ ఎలాంటి ప్రభావం చూపలేదని తెలిపింది. రెమెడిసివర్ని హైడ్రాక్సీ క్లోరోక్విన్, లోపినావిర్, రిటోనావిర్, ఇంటర్ఫెరోన్ వంటి ఔషధాలతో కలిపి ఇచ్చినప్పుడు వాటి ప్రభావం స్వల్పంగానూ, కొన్ని సమయాల్లో అసలేమీ లేదని వారు తెలిపారు. ఉన్నట్టు గుర్తించారు. కాగా భారత్ సహా దాదాపు 50 దేశాల్లో కరోనా చికిత్సలో భాగంగా ఈ మెడిసిన్కి అనుమతులు ఉన్నాయి.
Read More: