AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shreyas Iyer : ఫస్ట్ 4 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా లేని ఏకైక భారత కెప్టెన్.. చెత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్న అయ్యర్

Shreyas Iyer : ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ ఓటమి పాలైంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రవి బిష్ణోయ్ వేసిన 17వ ఓవర్‌ను మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా పేర్కొన్నారు. ఈ ఓటమితో అయ్యర్ పేరిట ఒక అవాంఛిత రికార్డు నమోదైంది.

Shreyas Iyer : ఫస్ట్ 4 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా లేని ఏకైక భారత కెప్టెన్.. చెత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్న అయ్యర్
Shreyas Iyer
Rakesh
|

Updated on: Jul 05, 2026 | 2:46 PM

Share

Shreyas Iyer : ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత యువ జట్టుకు రెండో టీ20 మ్యాచ్‌లో చేదు అనుభవం ఎదురైంది. లండన్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఇంగ్లాండ్ జట్టు 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు నిర్దేశించిన 191 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఇంకా కొన్ని బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్‌కు ఈ మ్యాచ్‌లోనూ విజయం దక్కకపోవడం అభిమానులను కాస్త నిరాశకు గురిచేసింది.

మ్యాచ్ ముగిసిన అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ఓటమికి గల కారణాలను విశ్లేషించారు. “మనం ఎక్కడ తప్పు చేశామో నాకు స్పష్టంగా తెలుసు. కానీ, ఓటమికి బాధ్యుడిగా చేస్తూ నేను ఏ ఒక్క ఆటగాడిని వేలెత్తి చూపించను. 15 ఓవర్ల వరకు మ్యాచ్ మన చేతుల్లోనే ఉంది, కానీ ఆ తర్వాత మొమెంటం పూర్తిగా చేజారింది” అని అయ్యర్ పేర్కొన్నారు. ముఖ్యంగా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ వేసిన 17వ ఓవర్‌ను ఆయన మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా అభివర్ణించారు. ఆ ఓవర్లో వచ్చిన నో-బాల్స్ జట్టుపై ఒత్తిడి పెంచాయని, అయితే బిష్ణోయ్ దీని నుంచి నేర్చుకుని తదుపరి మ్యాచ్‌ల్లో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ చేస్తాడని అయ్యర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

నిజానికి 191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుకు ఆరంభంలోనే టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కోలుకోలేని దెబ్బ తీశాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే ఇంగ్లాండ్ స్టార్ ఓపనర్లు ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ ఇద్దరినీ డకౌట్ చేసి పంపించాడు. అయితే ఆ తర్వాత వచ్చిన హ్యారీ బ్రూక్ (39), టాం బాంటన్ (39) ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ముఖ్యంగా జాకబ్ బెథెల్ కేవలం 76 పరుగులతో భారత బౌలర్లపై విరుచుకుపడి మ్యాచ్‌ను భారత్ నుంచి పూర్తిగా లాగేసుకున్నాడు. 16 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్‌కు 49 పరుగులు కావాలి, రన్ రేట్ దాదాపు 12గా ఉన్న సమయంలో భారత బౌలర్లు చేతులెత్తేశారు.

మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా మార్చేసింది మాత్రం 17వ ఓవరే అని చెప్పాలి. రవి బిష్ణోయ్ వేసిన ఆ ఓవర్లో ఇంగ్లాండ్ బ్యాటర్లు రెచ్చిపోయి ఏకంగా 29 పరుగులు రాబట్టారు. నో బాల్స్ వేయడం, వాటిని ఇంగ్లాండ్ బ్యాటర్లు బౌండరీలుగా మలచడంతో అప్పటివరకు ఉత్కంఠగా ఉన్న మ్యాచ్ కాస్త ఒక్కసారిగా ఇంగ్లాండ్ వైపు తిరిగిపోయింది. ఈ పిచ్‌పై 190 పరుగులు అనేది డిఫెండ్ చేసుకోవడానికి చాలా మంచి స్కోరు అని, కానీ బౌలింగ్ వైఫల్యం వల్లే ఓడిపోయామని అయ్యర్ ఒప్పుకున్నారు. అదే సమయంలో ఆఖరి ఓవర్లలో కేవలం 11 బంతుల్లో 24 పరుగులు చేసిన తిలక్ వర్మ ఆటతీరును కెప్టెన్ ప్రత్యేకంగా అభినందించారు.

భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ గురించి అయ్యర్ మాట్లాడుతూ, అతనికి భయం లేని ఆటతీరు ఉందని కొనియాడారు. “అతను మైదానంలో ఆడుతుంటే చూడటానికి చాలా ముచ్చటగా ఉంది. ఇంత పెద్ద మ్యాచ్‌లో అతను ఏమాత్రం ఒత్తిడికి గురైనట్లు అనిపించలేదు. గత కొన్ని నెలలుగా అతను అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు” అని అయ్యర్ చెప్పారు. మరోవైపు ఇంగ్లాండ్ ప్లేయర్ శామ్ కరన్ కెప్టెన్సీని కూడా ఆయన మెచ్చుకున్నారు. గ్రౌండ్ కొలతలను సరిగ్గా అంచనా వేసి, భారత లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకు షాట్లు ఆడేందుకు రూమ్ ఇవ్వకుండా ఇంగ్లాండ్ బౌలర్లు కట్టడి చేశారని అయ్యర్ అంగీకరించారు.

ఈ ఓటమితో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పేరిట ఒక అవాంఛిత, ఇష్టం లేని రికార్డు నమోదైంది. భారత క్రికెట్ చరిత్రలో కనీసం 3 కంటే ఎక్కువ మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించిన 12 మంది కెప్టెన్లలో.. తన కెప్టెన్సీ కెరీర్ ప్రారంభంలో ఆడిన మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్కటంటే ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయిన ఏకైక కెప్టెన్‌గా అయ్యర్ నిలిచారు. అతని నాయకత్వంలో భారత్ గతంలో ఐర్లాండ్‌లో రెండు మ్యాచ్‌లు ఓడిపోగా, ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్ వర్షార్పణమైంది. ఇప్పుడు రెండో మ్యాచ్‌లోనూ ఓటమి ఎదురవడంతో అయ్యర్ కెప్టెన్సీ ట్రాక్ రికార్డు మరింత బలహీనపడింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బొద్దింకలను చూసి ఆడవాళ్లే ఎక్కువగా భయపడతారా?
బొద్దింకలను చూసి ఆడవాళ్లే ఎక్కువగా భయపడతారా?
సామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా 2, వాచ్ 9 ప్రత్యేకతలివే
సామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా 2, వాచ్ 9 ప్రత్యేకతలివే
నల్లగొండ చెరువుగట్టులో భారీ అగ్ని ప్రమాదం! ఎగసిపడుతున్న మంటలు
నల్లగొండ చెరువుగట్టులో భారీ అగ్ని ప్రమాదం! ఎగసిపడుతున్న మంటలు
మరణించిన వ్యక్తికి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నోటీసు.. కోర్టు కీలక తీర్పు
మరణించిన వ్యక్తికి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నోటీసు.. కోర్టు కీలక తీర్పు
'మంగళవారం 2': కొరటాల శివ నిర్మాణంలో భారీ సీక్వెల్
'మంగళవారం 2': కొరటాల శివ నిర్మాణంలో భారీ సీక్వెల్
వారెవ్వా.. సండే రోజు తప్పక చేసుకోవాల్సిందే.. కారం కారంగా చికెన్
వారెవ్వా.. సండే రోజు తప్పక చేసుకోవాల్సిందే.. కారం కారంగా చికెన్
ఒక్కసారి డిపాజిట్ చేస్తే చాలు.. జీవితాంతం నెలకు రూ.20,000 పెన్షన్
ఒక్కసారి డిపాజిట్ చేస్తే చాలు.. జీవితాంతం నెలకు రూ.20,000 పెన్షన్
జూలై 26 దినఫలాలు: ఆ రాశుల వారికి అదృష్టం ఖాయం..మీ రాశికి ఎలా..?
జూలై 26 దినఫలాలు: ఆ రాశుల వారికి అదృష్టం ఖాయం..మీ రాశికి ఎలా..?
వీరికి నిలిచిపోనున్న పీఎం కిసాన్‌ డబ్బులు.. స్పష్టం చేసిన కేంద్రం
వీరికి నిలిచిపోనున్న పీఎం కిసాన్‌ డబ్బులు.. స్పష్టం చేసిన కేంద్రం
లైంగిక నేర బాధితురాలి గోప్యతకై హైకోర్టు న్యాయవాది పోరాటం
లైంగిక నేర బాధితురాలి గోప్యతకై హైకోర్టు న్యాయవాది పోరాటం