కాస్త ఓపిక పట్టండి: బన్నీ మూవీపై నిర్మాతల ప్రకటన
‘కాస్త ఓపిక పట్టండి’ అంటూ మెగాభిమానులకు హారిక అండ్ హాసిని నిర్మాతలు విన్నవించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన డిసెంబర్ 31నే వచ్చేసింది. అయితే దాదాపు మూడు నెలలు పూర్తి అవుతున్నా ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్పై టాలీవుడ్లో అనుమానాలు మొదలయ్యాయి. స్క్రిప్ట్ బన్నీకి నచ్చలేదని, ఈ సినిమా కోసం అల్లు అర్జున్ బరువు తగ్గేందుకు ఇంకా సమయం […]
‘కాస్త ఓపిక పట్టండి’ అంటూ మెగాభిమానులకు హారిక అండ్ హాసిని నిర్మాతలు విన్నవించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన డిసెంబర్ 31నే వచ్చేసింది. అయితే దాదాపు మూడు నెలలు పూర్తి అవుతున్నా ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్పై టాలీవుడ్లో అనుమానాలు మొదలయ్యాయి. స్క్రిప్ట్ బన్నీకి నచ్చలేదని, ఈ సినిమా కోసం అల్లు అర్జున్ బరువు తగ్గేందుకు ఇంకా సమయం పడుతోందని.. ఇలా రకరకాల వార్తలు వినిపించాయి.
అయితే వీటన్నింటికి చెక్ పెడుతూ నిర్మాతలు ట్వీట్ చేశారు. ‘‘మీ అందరి భావాలను మేము గౌరవిస్తాం. త్రివిక్రమ్, అల్లు అర్జున్ ప్రాజెక్ట్పై మీలాగే మాకు చాలా ఆసక్తి ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అన్నీ కుదిరిన తరువాత మీకు చెప్తాం. ఆ రోజు వరకు వేచి ఉండండి. త్వరలోనే అన్ని అప్డేట్స్ను చెప్తాం’’ అంటూ నిర్మాతలు ట్వీట్ చేశారు. కాగా హారిక అండ్ హాసిని ఎంటర్టైన్మెంట్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ నటుడు నానా పటేకర్, టబు కీలక పాత్రలలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
As the pre-production works are going on at full swing, we will only be able to share once everything is concrete. Kindly, bare with us until such day.
Very soon, we will come up with all the updates!@GeethaArts @vamsi84
2/2
— Haarika & Hassine Creations (@haarikahassine) March 28, 2019