Mukhachitram: ఓటీటీలోకి వచ్చేస్తోన్న విశ్వక్‏సేన్ ముఖచిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

గతేడాది డిసెంబర్ లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతుంది.

Mukhachitram: ఓటీటీలోకి వచ్చేస్తోన్న విశ్వక్‏సేన్ ముఖచిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Mukhachitram
Follow us

|

Updated on: Feb 02, 2023 | 12:05 PM

గత కొద్ది రోజులుగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఆన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే పోటీపడి మరీ తెలుగు చిత్రాలను భారీ ధరలకు అనౌన్స్ చేస్తున్నాయి. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్ పలు చిత్రాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే సూపర్ హిట్ ఫిల్మ్ 18 పేజిస్ ఆహాలో స్ట్రీమింగ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకుంది. తాజాగా మరో చిత్రం కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమయ్యింది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కీలకపాత్రలో నటించిన కోర్టు రూమ్ డ్రామా సినిమా ముఖచిత్రం. ఇందులో వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రలు పోషించగా.. డైరెక్టర్ గంగాధర్ దర్శకత్వం వహించారు. గతేడాది డిసెంబర్ లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతుంది.

ప్రముఖ ఓటీటీ మాద్యమం ఆహా ముఖచిత్రం ఓటీటీ రైట్స్ దక్కించుకుంది. ఈ సినిమాను రేపటి నుంచి అంటే ఫిబ్రవరి 3 నుంచి అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని ఆహా ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేసింది. థియేటర్లలో విడుదలైన దాదాపు 50 రోజుల తర్వాత ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమాను పాకెట్ మనీ బ్యానర్ పై ప్రదీప్ యాదవ్, మోహన్ ఎల్లా సినిమాని నిర్మించారు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమా ఓటీటీ ప్రీమియర్ కు సంబంధించిన కొత్త ట్రైలర్ రిలీజ్ చేసింది ఆహా. అయితే థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోయిన కొన్ని చిత్రాలకు ఓటీటీలో భారీ రెస్పాన్స్ వస్తుంది. అలా డిజిటల్ ప్లాట్ ఫాం పై సక్సెస్ అయిన చిత్రాలు చాలానే ఉన్నాయి. ఇక ఇప్పుడు ముఖచిత్రం కూడా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ రాబట్టనుందో చూడాలి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.