AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఓటీటీలో బ్లాక్ బస్టర్.. 20 నిమిషాల క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్..

ఈ ఏడాదిలో విడుదలైన ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. కానీ ఓటీటీలో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఆ సినిమా దేశంలోని టాప్ 10 ట్రెండింగ్ జాబితాలో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతున్న ఈ సినిమా ఏంటీ.. ? ఇంతకీ ఆ మూవీలో ప్రత్యేకత ఏంటో తెలుసా.. ?

OTT Movie: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఓటీటీలో బ్లాక్ బస్టర్.. 20 నిమిషాల క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్..
Ground Zero
Rajitha Chanti
|

Updated on: Jun 30, 2025 | 8:39 AM

Share

2025 సంవత్సరంలో భారీ అంచనాల మధ్య విడుదలై అట్టర్ ప్లాప్ అయిన ఓ సినిమా ఇప్పుడు ఓటీటీలో సంచలనం సృష్టిస్తుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో దూసుకుపోతుంది. ఈ చిత్రం క్లైమాక్స్ అద్భుతంగా ఉంది. మనం మాట్లాడుతున్న సినిమా పేరు ‘గ్రౌండ్ జీరో’. ఈ ఏడాదిలో విడుదలైన యాక్షన్ డ్రామా చిత్రం. బిఎస్ఎఫ్ అధికారి నరేంద్ర నాథ్ ధర్ దుబే జీవితం ఆధారంగా రూపొందించిన సినిమా ఇది. ఇందులో బీఎస్ఎఫ్ ఆఫీసర్ పాత్రను ఇమ్రాన్ హష్మీ పోషించారు. సాయి తమహంకర్, జోయా హుస్సేన్, ముఖేష్ తివారీ, లలిత్ ప్రభాకర్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా కథ శ్రీనగర్ నేపథ్యంలో సాగుతుంది. మొదటి సన్నివేశం నరేంద్ర నాథ్ ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్ చేసే భయానక సన్నివేశంతో ప్రారంభమవుతుంది.

ఆ తర్వాత రెండు వైపుల నుండి బుల్లెట్లు రావడంతో ఉగ్రవాదులందరూ చనిపోతారు. ఆ తర్వాత జైష్-ఎ-మొహమ్మద్ నాయకుడు ఘాజీ బాబా చాలా మంది సైనికులను చంపేస్తారు. జైష్-ఎ-మొహమ్మద్ నాయకుడు ఢిల్లీలోని పార్లమెంట్ భవనంపై, గుజరాత్‌లోని అక్షరధామ్‌పై దాడి చేస్తాడు. నిఘా బృందం కూడా ఘాజీ బాబాను గుర్తించడంలో విఫలమవుతుంద., కానీ నరేంద్ర నాథ్ తన నిఘా సహాయంతో ఘాజీ బాబా శ్రీనగర్‌లో దాక్కున్నాడని తెలుసుకుంటారు. ఆ తరువాత నరేంద్ర నాథ్ ధర్ దూబే తన సీనియర్ అనుమతి లేకుండా ఘాజీ బాబా దాక్కున్న ప్రదేశంపై దాడి చేస్తాడు. క్లైమాక్స్‌లోని 20 నిమిషాలు మిమ్మల్ని ఆద్యంతం కట్టిపడేస్తుంది.

ఈ చిత్రం జూన్ 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై ఇప్పుడు జనాలను ఆకట్టుకుంటుంది. దేశంలోని టాప్ 10 జాబితాలో మూడవ స్థానంలో ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. నివేదిక ప్రకారం, ‘గ్రౌండ్ జీరో’ చిత్రం భారతదేశంలో రూ. 8.98 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా, ఈ చిత్రం మొత్తం రూ. 10.35 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి తేజస్ ప్రభా విజయ్ డియోస్కర్ దర్శకత్వం వహించారు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..