AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డీఆర్‌సీ సమావేశంలో ఆసక్తికర ఘటన..! కప్పు పక్కనపెట్టి గాజు గ్లాసు కోరిన మంత్రి నాదెండ్ల!

ఏలూరు జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా సమీక్ష కమిటీ (DRC) సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యవహరించిన తీరు ఆసక్తికరంగా మారింది. సమావేశం సందర్భంగా అధికారులు మర్యాదపూర్వకంగా ఆయనకు పింగాణీ కప్పులో తేనీరు అందించగా, మంత్రి దానిని స్వీకరించకుండా గాజు గ్లాసులో టీ కావాలని కోరారు.

డీఆర్‌సీ సమావేశంలో ఆసక్తికర ఘటన..! కప్పు పక్కనపెట్టి గాజు గ్లాసు కోరిన మంత్రి నాదెండ్ల!
Minister Nadand Manohar
B Ravi Kumar
| Edited By: |

Updated on: Aug 06, 2026 | 10:28 AM

Share

ఏలూరు జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా సమీక్ష కమిటీ (DRC) సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యవహరించిన తీరు ఆసక్తికరంగా మారింది. సమావేశం సందర్భంగా అధికారులు మర్యాదపూర్వకంగా ఆయనకు పింగాణీ కప్పులో తేనీరు అందించగా, మంత్రి దానిని స్వీకరించకుండా గాజు గ్లాసులో టీ కావాలని కోరారు. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది వెంటనే గాజు గ్లాసులో తేనీరు తీసుకొచ్చి అందించగా, అదే గ్లాసులో మంత్రి టీ తాగారు.

సమావేశంలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది సమక్షంలో జరిగిన ఈ ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. గాజు గ్లాసు అనేది జనసేన పార్టీ ఎన్నికల గుర్తు కావడంతో, మంత్రి నాదెండ్ల మనోహర్ తన పార్టీ గుర్తుపై ఉన్న అనుబంధాన్ని ఈ విధంగా వ్యక్తం చేశారనే చర్చ మొదలైంది. సాధారణంగా ప్రభుత్వ సమావేశాల్లో పింగాణీ కప్పులు లేదా డిస్పోజబుల్ కప్పుల్లో టీ అందించడం ఆనవాయితీ. అయితే, ప్రత్యేకంగా గాజు గ్లాసులోనే టీ కావాలని కోరడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురి చేసింది.

మంత్రి అభ్యర్థన మేరకు సిబ్బంది వెంటనే గాజు గ్లాసు ఏర్పాటు చేయడం, అనంతరం ఆయన అదే గ్లాసులో టీ తాగడం సమావేశంలో కొంతసేపు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండటంతో రాజకీయ వర్గాల్లోనూ దీనిపై చర్చ సాగుతోంది. జనసేన కార్యకర్తలు మాత్రం దీనిని పార్టీ గుర్తుపై మంత్రి చూపిన అభిమానానికి నిదర్శనంగా అభివర్ణిస్తున్నారు.

అయితే ఈ ఘటనపై అధికారికంగా మంత్రి కార్యాలయం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇది కేవలం వ్యక్తిగత అభిరుచి కారణంగానా, లేక పార్టీ గుర్తుకు ప్రతీకాత్మకంగా గాజు గ్లాసును ఎంచుకున్నారా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా, డీఆర్‌సీ సమావేశంలో జరిగిన ఈ చిన్న సంఘటన ఇప్పుడు ఏలూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. సమావేశంలోని పరిపాలనా అంశాల కంటే మంత్రి గాజు గ్లాసులో టీ తాగిన సంఘటనే ప్రస్తుతం ఎక్కువగా చర్చనీయాంశంగా మారడం విశేషం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కామన్వెల్త్ విజేతలతో ప్రధాని మోదీ సందడి..
కామన్వెల్త్ విజేతలతో ప్రధాని మోదీ సందడి..
పవర్ ఫుల్ గౌరీ హెగ్డేగా టబు.. స్లమ్ డాగ్ గ్లింప్స్ రిలీజ్..
పవర్ ఫుల్ గౌరీ హెగ్డేగా టబు.. స్లమ్ డాగ్ గ్లింప్స్ రిలీజ్..
కేవలం 30 నిమిషాల్లో కరకరలాడే జిలేబీ.. ఇంట్లో ఎలా చేయాలో తెలుసా?
కేవలం 30 నిమిషాల్లో కరకరలాడే జిలేబీ.. ఇంట్లో ఎలా చేయాలో తెలుసా?
స్వామి భద్రేశ్‌దాస్‌కు ‘వేదాంతవిద్యా విశ్వగురు’ గౌరవం
స్వామి భద్రేశ్‌దాస్‌కు ‘వేదాంతవిద్యా విశ్వగురు’ గౌరవం
10 ఏళ్లుగా ఎవ్వరూ టచ్ చేయలే.. ఏకైక భారత ఆటగాడిగా భారీ రికార్డ్..!
10 ఏళ్లుగా ఎవ్వరూ టచ్ చేయలే.. ఏకైక భారత ఆటగాడిగా భారీ రికార్డ్..!
ఊర కుక్కలు వర్సెస్ నీటి కుక్కలు.. పోరులో గెలుపు ఎవరిది..?
ఊర కుక్కలు వర్సెస్ నీటి కుక్కలు.. పోరులో గెలుపు ఎవరిది..?
గుంటూరు స్పెషల్ కాకరకాయ కారం.. ఇలా చేసి ఒక్కసారి తింటే ఇక వదలరు!
గుంటూరు స్పెషల్ కాకరకాయ కారం.. ఇలా చేసి ఒక్కసారి తింటే ఇక వదలరు!
అర్ధరాత్రి ఆర్టీసీ బస్సులో భారీ నగదుతోపాటు ల్యాప్‌టాప్ ప్రత్యక్షం
అర్ధరాత్రి ఆర్టీసీ బస్సులో భారీ నగదుతోపాటు ల్యాప్‌టాప్ ప్రత్యక్షం
పోలీస్ స్టేషన్ లో మనోజ్ రచ్చ.. సారీ చెప్పాలంటూ డిమాండ్..
పోలీస్ స్టేషన్ లో మనోజ్ రచ్చ.. సారీ చెప్పాలంటూ డిమాండ్..
జస్ట్‌ 45 మినెట్స్.. హైదరాబాద్‌ టూ విజయవాడ.. ఎగిరి గంతేసే న్యూస్
జస్ట్‌ 45 మినెట్స్.. హైదరాబాద్‌ టూ విజయవాడ.. ఎగిరి గంతేసే న్యూస్