First Day First Show: హీరోకు పవన్‌ సినిమా టికెట్లు దొరికాయా? లేదా? ఫస్డ్‌ డే ఫస్ట్‌ షో ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

First Day First Show OTT Release: నూతన హీరో, హీరోయిన్లు శ్రీకాంత్ రెడ్డి ,సంచిత బాషు జంటగా నటించిన చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో. జాతిరత్నాలు సినిమాతో అందరి దృష్టి ఆకర్షించిన అనుదీప్‌ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు సమకూర్చారు.

First Day First Show: హీరోకు పవన్‌ సినిమా టికెట్లు దొరికాయా? లేదా? ఫస్డ్‌ డే ఫస్ట్‌ షో ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
First Day First Show
Follow us

|

Updated on: Sep 15, 2022 | 3:46 PM

First Day First Show OTT Release: నూతన హీరో, హీరోయిన్లు శ్రీకాంత్ రెడ్డి ,సంచిత బాషు జంటగా నటించిన చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో. జాతిరత్నాలు సినిమాతో అందరి దృష్టి ఆకర్షించిన అనుదీప్‌ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు సమకూర్చారు. వంశీధర్‌ గౌడ్‌, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి సంయుక్తంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటించిన ఖుషీ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకు టికెట్స్ హీరో ఎలా సంపాదించాడనే అంశంపై ఈ సినిమాను తెరకెక్కించారు. పవన్‌ జన్మదిన కానుకగా సెప్టెంబర్‌ 2న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో విడుదలైన రెండు వారాల్లోపే డిజిటల్‌ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహ లో ఈ నెల 23 నుంచి ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. కాగా ఈ సినిమాను పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మించారు. వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటించారు. ట్రైలర్‌ అంచనాలు పెంచేసినా థియేటర్లలో విడుదలయ్యాక మాత్రం మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. మరి థియేటర్లలో ఈ సినిమాను చూడలేని వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!