AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: థియేటర్లలో కాదు.. ఓటీటీలోనే రిలీజ్ అవుతున్న రష్మిక మందన్నా సినిమా.. ‘మిషన్ మజ్ను’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

ఇటీవలే గుడ్ బై సినిమాతో నార్త్ ఆడియన్స్ ముందుకు వచ్చిన రష్మిక.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక మరోవైపు రష్మిక చేతిలో ఉన్న హిందీ చిత్రాల్లో మిషన్ మజ్ను ఒకటి.

Rashmika Mandanna: థియేటర్లలో కాదు.. ఓటీటీలోనే రిలీజ్ అవుతున్న రష్మిక మందన్నా సినిమా.. 'మిషన్ మజ్ను' స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Mission Majnu Movie Ott
Rajitha Chanti
|

Updated on: Dec 14, 2022 | 1:10 PM

Share

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఈ మూవీతో అటు హిందీలోనూ భారీగానే ఆఫర్లు అందుకుంది. ప్రస్తుతం తెలుగుతోపాటు.. తమిళం, హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తుంది. ఇటీవలే గుడ్ బై సినిమాతో నార్త్ ఆడియన్స్ ముందుకు వచ్చిన రష్మిక.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక మరోవైపు రష్మిక చేతిలో ఉన్న హిందీ చిత్రాల్లో మిషన్ మజ్ను ఒకటి. ఇందులో యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై క్యూరియాసిటిని పెంచేశాయి. దీంతో ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశే మిగిల్చారు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నారు మేకర్స్.

వచ్చే ఏడాది జనవరి 20న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ నేషనల్ క్రష్.. ఎన్నో ఆశలతో బీటౌన్ లోకి అడుగుపెట్టింది. కానీ మొదటి సినిమా గుడ్ బై సరిగ్గా ఆడలేదు. ఇక రెండో సినిమా మిషన్ మజ్ను ఓటీటీలోకి రాబోతుంది. ఇక ఇప్పుడు అమ్మడు ఆశలన్నీ యానిమల్ సినిమాపైనే ఉన్నాయి. ఇందులో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. డైరెక్టర్ సందీప్ తెరకెక్కిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక మరోవైపు తెలుగులో అల్లు అర్జున్.. సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న పుష్ప 2 చిత్రంలోనూ నటిస్తుంది రష్మిక. అలాగే విజయ్ దళపతి, వంశీ పైడిపల్లి కాంబోలో రాబోతున్న వరిసు మూవీలోనూ నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం