AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఊరి పెద్దను ఎవరు హత్య చేశారు? ఓటీటీలో మైండ్ బ్లాక్ అయ్యే క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు

థియేటర్లలో విడుదలైన సినిమాలు ఓటీటీలో ఎప్పుడు వస్తాయో అని ఆడియెన్స్ ఎదురు చూస్తుంటారు. ఈ మధ్యన మూవీ లవర్స్ ఎక్కువగా క్రైమ్, సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ సినిమాలపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది.

OTT Movie: ఊరి పెద్దను ఎవరు హత్య చేశారు? ఓటీటీలో మైండ్ బ్లాక్ అయ్యే క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
OTT Movie
Basha Shek
|

Updated on: May 18, 2025 | 6:56 AM

Share

ఇటీవల కన్నడ నాట ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ విడుదలైంది. ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అక్కడి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని క్రైమ్ డ్రామా, ట్విస్టులు ఆడియెన్స్ ను థ్రిల్ కు గురి చేశాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. 25 ఏళ్లుగా అసలు నేరాలే జరగని ఒక ఊరిలో అనుమానాస్పద రీతిలో ఓ వ్యక్తిని చంపేస్తే ఏమైందనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు మేకర్స్. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక ఊరిలో గత 25 ఏళ్లుగా ఒక్క క్రైమ్ కూడా జరగదు. అలాంటి ఊరికి గోవిందు అనే పోలీస్ బదిలీపై వస్తాడు. ఇక అంతా ప్రశాంతంగా ఉంది అనుకున్న సమయంలో ఆ ఊరి పెద్ద దారుణ హత్యకు గురవుతాడు. పోలీసు గోవింద్ పంకజ, రోహిత్, శ్రీనివాసయ్య అనే ముగ్గురిపై అనుమానం వ్యక్తం చేస్తాడు. మరి ఈ ముగ్గురే ఊరి పెద్దను హత్య చేశారా? ఇంతకీ హంతకుడు ఎవరు? 1970లో ఇదే ఊరిలో జరిగిన సంఘటనకు ఈ హత్యకు సంబంధమేంటి? అనేది తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న సినిమా పేరు అజ్ఞాతవాసి. ప్రముఖ దర్శకుడు హేమంత్ రావు నిర్మించిన ఈ సినిమాలో రంగాయణ రఘు, సిద్దు మూలిమణి, శరత్ లోహితాశ్వ, పవన గౌడ, రవిశంకర్ గౌడ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జనార్ధన్ చిక్కన్న దర్శకత్వం వహించారు. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 8.6 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన అజ్ఞాతవాసి సినిమా ఇప్పుడు OTTలోకి వస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ Zee5 దీని గురించి సమాచారాన్ని అందించింది.

తెలుగులోనూ స్ట్రీమింగ్..

సాధారణంగా ఓటీటీల్లో సినిమాలు వారాంతాల్లో ప్రసారం అవుతాయి. అయితే, ‘అజ్ఞాతవాసి’ సినిమా బుధవారం (మే 28) నుంచి స్ట్రీమింగ్ కు రానుంది. కాగా ఈ సినిమా థియేటర్లలో విడుదలైన ఏడు వారాల తర్వాత OTTకి వస్తోంది. ఇది ZEE5, నిర్మాతల మధ్య ఒప్పందం కావచ్చునని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!