Veera Simha Reddy: బాలయ్య ‘వీరసింహరెడ్డి’ ఓటీటీ పార్టనర్ లాక్.. స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడే!

నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ హీరోహీరోయిన్లుగా గోపీచంద్ మలినేని దర్శకత్వం తెరకెక్కించిన చిత్రం 'వీరసింహరెడ్డి'..

Veera Simha Reddy: బాలయ్య 'వీరసింహరెడ్డి' ఓటీటీ పార్టనర్ లాక్.. స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడే!
Veera Simha Reddy
Follow us

|

Updated on: Jan 13, 2023 | 9:35 AM

నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ హీరోహీరోయిన్లుగా గోపీచంద్ మలినేని దర్శకత్వం తెరకెక్కించిన చిత్రం ‘వీరసింహరెడ్డి’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ.. విడుదలైన ప్రతీ చోటా మొదటి షో నుంచే హిట్ టాక్‌ తెచ్చుకుని దూసుకుపోతోంది. బాలయ్య మేనరిజమ్స్‌, డైలాగ్స్‌ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్‌ అందిస్తున్నాయి. ఇక థియేటర్లలో సందడి చేసిన చిత్రాలు ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ‘వీరసింహరెడ్డి’ సినిమా కూడా తన ఓటీటీ పార్టనర్‌ను లాక్ చేసుకుందని తెలుస్తోంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్‌స్టార్ ఈ సినిమా ఓటీటీ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం. సాధారణంగా హిట్ చిత్రాలు అన్నీ కూడా థియేటర్లలో రిలీజ్ అయిన ఎనిమిది వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుండగా.. కొన్ని మూవీస్ అయితే నాలుగు వారాలకే అందుబాటులోకి వస్తున్నాయి. అయితే వీరసింహరెడ్డి సినిమా రిలీజైన 8 వారాల అనంతరం ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. కాగా, ఈ చిత్రంలో కన్నడ స్టార్ నటుడు దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్, హనీ రోజ్ కీలక పాత్రల్లో కనిపించారు. అలాగే ఈ చిత్రానికి ఎస్. ఎస్. తమన్ సంగీతం అందించగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.