మళ్లీ అదే సమస్య‌.. ప్రభాస్‌ మూవీకే ఎందుకిలా..!

ప్రభాస్ మూవీకి మళ్లీ అదే సమస్య ఎదురైంది. 'సాహో' సమయంలో టీమ్‌ ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కొన్నారో, ఇప్పుడు అదే ఇబ్బందిని ప్రభాస్ 20వ మూవీ యూనిట్ ఎదుర్కొంటున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది.

మళ్లీ అదే సమస్య‌.. ప్రభాస్‌ మూవీకే ఎందుకిలా..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 23, 2020 | 6:20 PM

ప్రభాస్ మూవీకి మళ్లీ అదే సమస్య ఎదురైంది. ‘సాహో’ సమయంలో టీమ్‌ ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కొన్నారో, ఇప్పుడు అదే ఇబ్బందిని ప్రభాస్ 20వ మూవీ యూనిట్ ఎదుర్కొంటున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. అదేంటంటే.. ఈ సినిమా నుంచి మ్యూజిక్‌ డైరెక్టర్ తప్పుకున్నారట. ఇప్పటికే ఈ మూవీ కోసం రెండు, మూడు పాటలను కంపోజ్ చేసిన ఆయన క్రియేటివ్ డిఫరెన్స్‌లతో తప్పుకున్నట్లు టాక్.

కాగా ప్రభాస్ 20వ చిత్రాన్ని 2018లో అనౌన్స్‌ చేశారు. ఆ ఏడాదిలోనే షూటింగ్‌ కూడా ప్రారంభించారు. ఇక ఇప్పుడు ఈ మూవీ షూటింగ్‌ దాదాపుగా క్లైమాక్స్‌కు వచ్చేసింది. కానీ ఇంతవరకు సంగీత దర్శకుడిని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అయితే ‘సైరా’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జాతీయ అవార్డు గ్రహీత అమిత్‌ త్రివేది ప్రభాస్ మూవీకి సంగీతం అందించబోతున్నట్లు ఫిలింనగర్ వర్గాల నుంచి తెలిసింది. ఇక ఇప్పుడు ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరో సంగీత దర్శకుడి కోసం మూవీ యూనిట్ ఇప్పుడు వెతుకులాట ప్రారంభించినట్లు టాక్.

అయితే ప్రభాస్‌ ముందు చిత్రం సాహో విషయంలోనూ ఇదే జరిగింది. ఈ మూవీకి బాలీవుడ్ త్రయం శంకర్- ఇషాన్- లాయ్‌లు సంగీతం అందించబోతున్నట్లు టీమ్ అధికారికంగా ప్రకటించింది. కాగా సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుందన్న సమయంలో ఈ మూవీ నుంచి ఆ ముగ్గురు తప్పుకున్నారు. కొన్ని కారణాల వలన ప్రభాస్ మూవీ నుంచి బయటకు వచ్చినట్లు శంకర్ మహదేవన్ ట్విట్టర్‌లో తెలిపారు. ఆ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డ టీమ్.. పలువురు సంగీత దర్శకులతో ఆ సినిమాకు పాటలను చేయించుకుంది. అవి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి అది వేరే విషయం. ఇక ఇప్పుడు ప్రభాస్-రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కుతోన్న మూవీకి అలానే జరుగుతుండటంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. తమ అభిమాన నటుడి హీరోకే ఎందుకిలా అంటూ వారు వర్రీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత..? ప్రభాస్ 20వ చిత్రం నుంచి అమిత్ త్రివేది తప్పుకున్నాడా..? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా రొమాంటిక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. భాను శ్రీ, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ బ్యానర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Read This Story Also: నాగబాబు ట్వీట్లపై ఘాటుగా స్పందించిన పవన్‌.. ఆ వ్యాఖ్యలతో..!

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!