మలేషియాలో ‘మిస్టర్ కేకే’ సినిమాపై నిషేధం!
చియాన్ విక్రమ్ కథానాయకుడిగా నటించిన కడరం కొండాన్ తెలుగులో మిస్టర్ కె.కె టైటిల్ తో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రాజేష్ ఎమ్ సెల్వ దర్శకత్వంలో రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇందులో అక్షరా హాసన్, నాజర్ కుమారుడు అబీ హస్సన్ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 19న విడుదలైన సినిమా మంచి టాక్ అందుకుంది. భారత్లో ఈ సినిమా విజయవంతంగా ఆడుతోంది. అయితే మలేషియాలో ఈ చిత్రంపై నిషేధం విధించారు. […]
చియాన్ విక్రమ్ కథానాయకుడిగా నటించిన కడరం కొండాన్ తెలుగులో మిస్టర్ కె.కె టైటిల్ తో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రాజేష్ ఎమ్ సెల్వ దర్శకత్వంలో రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇందులో అక్షరా హాసన్, నాజర్ కుమారుడు అబీ హస్సన్ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 19న విడుదలైన సినిమా మంచి టాక్ అందుకుంది. భారత్లో ఈ సినిమా విజయవంతంగా ఆడుతోంది. అయితే మలేషియాలో ఈ చిత్రంపై నిషేధం విధించారు. సినిమాలో మలేషియా పోలీసులు, సమాజాన్ని తప్పుగా చూపించారని అక్కడి సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో మలేషియాలోని విక్రమ్ అభిమానులు కొందరు సింగపూర్కు వెళ్లి ‘మిస్టర్ కేకే’ సినిమా చూస్తున్నారట.