ఆ హీరోతో వన్స్మోర్ అంటోన్న కీర్తి..!
సినిమాల విషయంలో కీర్తి సురేష్ దూకుడును పెంచుతోంది. ఓ వైపు లేడి ఓరియెంటెడ్ చిత్రాలను చేస్తూనే.. మరోవైపు కమర్షియల్ చిత్రాలకు కూడా గ్రీన్సిగ్నల్ ఇస్తోంది.
సినిమాల విషయంలో కీర్తి సురేష్ దూకుడును పెంచుతోంది. ఓ వైపు లేడి ఓరియెంటెడ్ చిత్రాలను చేస్తూనే.. మరోవైపు కమర్షియల్ చిత్రాలకు కూడా గ్రీన్సిగ్నల్ ఇస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే మహేష్ బాబు మూవీలో నటిస్తున్నానని చెప్పిన కీర్తి.. మరో తెలుగు మూవీకి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. నితిన్ హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కిస్తోన్న ‘పవర్ పేట’ చిత్రంలో హీరోయిన్గా కీర్తి సురేష్ ఫైనల్ అయినట్లు సమాచారం. ‘రంగ్దే’ మూవీలో నితిన్- కీర్తి రొమాన్స్ని(సినిమా రషెస్ను) చూసిన దర్శకుడు కృష్ణ చైతన్య, ఈ జోడీని మరోసారి రిపీట్ చేయబోతున్నట్లు టాక్. దీనికి సంబంధించి ఆమెతో సంప్రదింపులు జరపడం, ఓకే చెప్పడం జరిగిపోయాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తమిళంలో ధనుష్ నటించిన పుదుపెట్టై రీమేక్గా ‘పవర్ పేట’ తెరకెక్కబోతున్నట్లు టాక్. మరి వీటన్నింటిలో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
కాగా కీర్తి నటించిన ‘పెంగ్విన్’ ఇటీవల ఆన్లైన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రాగా.. కీర్తి నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ నటి ప్రస్తుతం ‘రంగ్దే’, ‘అన్నాత్తే’, ‘మిస్ ఇండియా’, ‘గుడ్లక్ సఖి’, ‘మరక్కర్’ చిత్రాల్లో నటిస్తోంది.
Read This Story Also: ఇళ్ల మార్గదర్శకాల్లో ఏపీ ప్రభుత్వం సవరణలు.. ఐదేళ్ల తరువాత