AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hebha Patel: ‘కుమారి’ మళ్లీ ఫాంలోకి వస్తుందా..!

2015లో వచ్చిన కుమారి 21fతో టాలీవుడ్‌లో ఒక్కసారిగా హాట్‌ టాపిక్‌గా మారింది ముంబయి బ్యూటీ హెబా పటేల్. అంతకుముందు అలా ఎలా అనే చిత్రం

Hebha Patel: 'కుమారి' మళ్లీ ఫాంలోకి వస్తుందా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 19, 2020 | 12:34 PM

Share

2015లో వచ్చిన కుమారి 21fతో టాలీవుడ్‌లో ఒక్కసారిగా హాట్‌ టాపిక్‌గా మారింది ముంబయి బ్యూటీ హెబా పటేల్. అంతకుముందు అలా ఎలా అనే చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. కుమారి 21fతో అందరినీ తెగ ఆకట్టుకుంది హెబా. రొమాంటిక్ ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఈ అమ్మడు అద్భుతంగా నటించగా.. యూత్‌లో విపరీతమైన క్రేజ్ వచ్చింది.  ఇక ఈ సినిమా సక్సెస్‌తో హెబాకు అప్పట్లో వరుస ఆఫర్లు కూడా వచ్చాయి. అయితే సరైన స్క్రిప్ట్‌లను ఎంచుకోలేకపోవడం, ఫ్లాప్‌లు పడటంతో హీరోయిన్‌ రేస్‌‌లో ఈ భామ వెనుకపడిపోయింది. ఈ క్రమంలో 2018లో 24 కిస్సెస్ అనే చిత్రంలో మాత్రమే కనిపించిన ఈ బ్యూటీ.. ఆ తరువాత కనుమరుగైపోయింది. అంతేకాదు ఈ అమ్మడు బయట కనిపించిన సందర్భాలు కూడా చాలా తక్కువ.

అయితే ఇప్పుడు హెబాకు మళ్లీ ఆఫర్లు వస్తున్నాయి. హీరోయిన్‌గా కాకపోయినప్పటికీ.. రెండు చిత్రాల్లో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తోంది కుమారి. రాజ్ తరుణ్‌తో విజయ్ కుమార్ నటిస్తోన్న ఒరేయ్ బుజ్జిగాలో రెండో హీరోయిన్‌గా కనిపిస్తోన్న హెబా.. నితిన్ నటించిన భీష్మలో ఓ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాల్లో ఆమె పాత్ర కీలకం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు అహా ఫ్లాట్‌ఫాంలో వస్తోన్న మస్తీ అనే వెబ్ సిరీస్‌లో హెబా నటించింది. దీని ద్వారా వెబ్ సిరీస్‌ వరల్డ్‌లోకి అడుగెట్టింది హెబా. దీంతో హెబా మళ్లీ ఫామ్‌లోకి వచ్చిందని ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇలానే ఆమె సినిమాలు చేయాలని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. చూడాలి మరి సెకండ్ ఇన్నింగ్స్‌లో హెబా కెరీర్ దూసుకుపోతుందేమో..!