Dosa King Movie: మరో రియల్ స్టోరీతో జై భీమ్ దర్శకుడు.. దోసె కింగ్‌ తో 18 ఏళ్లు పోరాడిన జ్యోతి కథే మూవీ.. వివరాల్లోకి వెళ్తే

సినిమాల్లోలాగే 2001లో జీవజ్యోతి భర్తను హత్య చేయించాడు. దీంతో తనకు జరిగిన అన్యాయంపై పోలీసులను ఆశ్రయించింది జీవజ్యోతి. డబ్బుంది కదానే మొదట్లో కేసు కదల్లేదు. జీవజ్యోతి ఏడుపు ఎవరికీ పట్టలేదు… కానీ మీడియా పట్టుకుంది… వెంటబడింది..

Dosa King Movie: మరో రియల్ స్టోరీతో జై భీమ్ దర్శకుడు.. దోసె కింగ్‌ తో 18 ఏళ్లు పోరాడిన జ్యోతి కథే మూవీ.. వివరాల్లోకి వెళ్తే
Dosa King Movie
Follow us

|

Updated on: Jul 27, 2022 | 7:08 AM

Dosa King Movie: ఇరవై ఏళ్లనాటి సంఘటన ఇప్పుడు కథగా కార్యరూపం దాల్చుతోంది. ఓ మహిళ సుధీర్ఘ పోరాటగాథ.. చిత్రంగా తెరకెక్కబోతోంది. న్యాయం కోసం ఓ మహిళ యుద్ధమే చేసింది. ఎన్నో బెదిరింపులు, మరెన్నో బుజ్జగింపులు.. అయినా ఎక్కడా తగ్గలేదు.. దేనికీ భయపడలేదు. అవతల ఉన్నది వందల కోట్లకు అధిపతి, వేలాది ఉద్యోగుల దేవుడు.. అయితేనేం తనకు జరిగిన ద్రోహంపై న్యాయపోరాటం చేసింది. ఇప్పుడామె కథ ‘జైభీమ్‌’ దర్శకుడు జ్ఞానవేల్‌ దర్శకత్వంలో బాలీవుడ్‌లో ‘దోసె కింగ్‌’గా చిత్ర రూపం దాలుస్తోంది.

‘శరవణ భవన్‌’ పి.రాజగోపాల్‌ ‘దోసె కింగ్‌’ గా ప్రపంచవ్యాప్తంగా పేరు గడించాడు. శరవణ భవన్‌లో వేలాది ఉద్యోగులకు రకరకాల అలవెన్సులు ఇస్తూ కన్నబిడ్డల్లా చూసుకుంటూ దేవుడయ్యాడు. అతని మాటకు ఎదురు లేదు. 1979 నుంచీ శరవణన్ హోటళ్లు అంటేనే ఓ ట్రెండ్… శుచి, శుభ్రత, నాణ్యత… తమిళనాడులోనే కాదు, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోనూ విస్తరించాయి. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా 22 దేశాల్లో శరవణభవన్‌కు ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంది. రాజగోపాల్‌ను చెన్నై వచ్చిన కొత్తల్లో ఒక జ్యోతిష్యుడు సలహా మేరకు హోటల్ రంగంలోకి అడుగుపెట్టాడు.. ఏదైనా ‘అగ్ని’తో ముడిపడిన వ్యాపారం పెట్టమని చెప్పడంతో.. రాజగోపాల్‌ ‘శరవణ భవన్‌’ రెస్టారెంట్‌ పెట్టి, సక్సెస్‌ అయ్యాడు. దేశ విదేశాల్లో తన హోటల్‌ సామ్రాజ్యాన్ని విస్తరించి 30 వేల కోట్ల సంపదకు ఎగబాకాడు. జ్యోతిష్యుడు చెప్పింది నిజమైంది. అగ్నితో సక్సెస్‌ అయిన రాజగోపాల్‌ ‘కామాగ్ని’తో వచ్చిన కీర్తి ప్రతిష్టలన్నింటినీ కాల్చేసుకున్నాడు.

నిజానికి కొందరు వ్యక్తుల బతుకుల్ని సక్సెస్ స్టోరీలుగా చెప్పుకుంటాం.. స్పూర్తిగాథలుగా ఆదర్శవంతులుగా తెగ పొగిడేస్తాం.. కానీ కొన్నిసార్లు ఆయా వ్యక్తుల వికృతరూపాలు బయటికి కనిపిస్తాయి. ఈ రాజగోపాలుడి కథ కూడా అదే… మొదట్లో హోటళ్లలో టేబుళ్లు క్లీన్ చేసి, కిరాణా షాపుల్లో పనిచేసిన రాజగోపాల్ తరువాత ఎంత సంపాదించాడో తనకే లెక్క తెలియదు.. తన దగ్గరే రామస్వామి అనే వ్యక్తి తన హోటళ్లలోనే అసిస్టెంట్ మేనేజర్‌గా చేసేవాడు. ఆయనకు జీవజ్యోతి అనే కూతురు ఉంది. 1999 ప్రాంతంలో ఆమె 12వ తరగతి చదువుతోంది. ఓరోజు ఓ దరిద్రపు జ్యోతిష్కుడు ఆమెను చూసి.. ఈమెను పెళ్లి చేసుకో, అన్ని దోషాలూ తొలగి, ఇంకా ఎదుగుతావు.. లేకపోతే దెబ్బతింటావు అంటూ ఉచిత సలహా ఇచ్చాడు. కానీ రాజగోపాలుడికి అప్పటికే రెండు పెళ్లిళ్లయ్యాయి… రెండో భార్య కృత్తికకు ఆల్‌రెడీ పెళ్లయితే, భర్తతో విడదీసి మరీ పెళ్లిచేసుకున్నాడు… ఇక ఈ జీవజ్యోతి మీద కన్నుపడింది… ఆమె తండ్రి ఎలాగూ పేదవాడు, తన దగ్గరే ఉద్యోగి, బెదిరించి ఆమెను మూడో పెళ్లి చేసేసుకుందాం అనుకున్నాడు, ప్రయత్నించాడు. ఈక్రమంలోనే బెదిరించాడు, ప్రలోభపెట్టాడు, కానీ ఆమె వినలేదు. అప్పటికే ప్రిన్స్ శాంతకుమార్‌ను ప్రేమించింది. ఇక రాజగోపాల్ వదిలేట్టు లేడని గ్రహించి, రామస్వామి బిడ్డను తీసుకుని సొంతూరుకు వెళ్లిపోయాడు.

ఇవి కూడా చదవండి

అయినప్పటీకీ రాజగోపాల్ వదల్లేదు… 9 మంది ముఠాకు సుఫారీ ఇచ్చాడు… సినిమాల్లోలాగే 2001లో జీవజ్యోతి భర్తను హత్య చేయించాడు. దీంతో తనకు జరిగిన అన్యాయంపై పోలీసులను ఆశ్రయించింది జీవజ్యోతి. డబ్బుంది కదానే మొదట్లో కేసు కదల్లేదు. జీవజ్యోతి ఏడుపు ఎవరికీ పట్టలేదు… కానీ మీడియా పట్టుకుంది… వెంటబడింది… హైప్రొఫైల్ నిందితుడు కదా… పైగా పిచ్చి జోస్యాల లింకు కూడా ఉంది… అలా అప్పటి ముఖ్యమంత్రి జయలలిత వద్దకు చేరింది. దీంతో వాడు ఎవడైతేనేం..? ఓ పట్టుపట్టండి అని పోలీసులకు అన్ని రైట్స్ ఇచ్చేసింది. మొరాయిస్తే అసలు కనిపించకుండా పోతావని హింట్ అందింది. ఇక చేసేదీ లేక రాజగోపాల్‌ పోలీసుల ముందు లొంగిపోయాడు. కేసును సుధీర్ఘంగా విచారించిన కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. కొన్నాళ్లకు బెయిల్ తెచ్చుకున్నాడు… కానీ పోలీసులు వెంటబడ్డారు… 2009లో హైకోర్టు ఆ పదేళ్ల జైలు శిక్షను కాస్తా యావజ్జీవ శిక్షగా మార్చింది. దీంతో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అపెక్స్ కోర్టు కూడా హైకోర్టు నిర్ణయాన్ని సమర్ధించింది. ఇక దిక్కులేక కోర్టులో లొంగిపోయాడు… ఆరోగ్యం దెబ్బతింది. చివరికి జైలుశిక్ష ప్రారంభమైన పదిరోజులకే గుండెపోటులో ప్రాణాలు విడిచాడు రాజ్‌గోపాల్.

సొంతూరుకు వెళ్లి, ఓ చిన్న హోటల్ పెట్టుకుంది జీవజ్యోతి… అది ఆమె తల్లి చూసుకునేది… తనేమో టైలరింగ్ షాపు పెట్టుకుంది… వధువుల డ్రెస్సులు కుట్టేది ఎక్కువగా… 18 ఏళ్లు పోరాడింది ఈ కేసులో… కోట్ల డబ్బును ఇస్తాను, కేసు విత్‌డ్రా చేసుకో, కోర్టులో మేం చెప్పినట్టు చెప్పు అని అడిగించాడు రాజగోపాల్ పలుసార్లు… లేకపోతే నిన్నూ ఖతం చేయిస్తాను అని బెదిరించాడు… ఆమె వినలేదు… వాడు చనిపోయి కూడా మూడేళ్లు అవుతోంది… మరి ఈ కథ ఇప్పుడెందుకు అంటారా..?

జైభీమ్ సినిమా తీసి ప్రశంసలు అందుకున్న జ్ఞానవేల్ తెలుసు కదా… ఇప్పుడు తను జీవజ్యోతి కథను తెరకెక్కిస్తున్నాడు… అదీ తమిళంలో కాదు… హిందీలో… సినిమా పేరు దోశా కింగ్… నిజంగానే ఆమె కథ బియాండ్ సినిమా కథ… అన్నిరకాల ఎమోషన్స్ ఉన్నాయి… తల్వార్, రాజీ సినిమాల నిర్మాణాల్లో భాగస్వాములైన జంగ్లీ పిక్చర్స్ ఈ జీవజ్యోతి సినిమాను నిర్మిస్తోంది… ఈ కేసుపై తమిళంలో, ఇంగ్లిషులో కొన్ని వందల కథనాలు వెలువడ్డాయి… కథ రాసుకోవడం పెద్ద కథేమీ కాదు… జరిగిన కథ జీవజ్యోతే చెబుతుంది… నిరుపమ సుబ్రహ్మణ్యన్ “Murder on the Menu” పేరిట ఓ పుస్తకం కూడా రాసింది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్