Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rinky Chakma: క్యాన్సర్ తో బ్యూటీ క్వీన్ కన్నుమూత.. 28 ఏళ్లకే మిస్ ఇండియా త్రిపుర మృతి

క్యాన్సర్ తో చనిపోతున్నవాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. కామన్ పీపుల్, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా చాలామంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అయితే చిన వయసులో చాలామంది పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మిస్ ఇండియా త్రిపుర 2017 రింకీ చక్మా క్యాన్సర్ తో పోరాడుతూ కన్నుమూశారు.

Rinky Chakma: క్యాన్సర్ తో బ్యూటీ క్వీన్ కన్నుమూత.. 28 ఏళ్లకే మిస్ ఇండియా త్రిపుర మృతి
Miss India Tripura
Follow us
Balu Jajala

|

Updated on: Mar 01, 2024 | 3:20 PM

క్యాన్సర్ తో చనిపోతున్నవాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. కామన్ పీపుల్, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా చాలామంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అయితే చిన వయసులో చాలామంది పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మిస్ ఇండియా త్రిపుర 2017 రింకీ చక్మా క్యాన్సర్ తో పోరాడుతూ కన్నుమూశారు. చనిపోయేనాటికి ఆమె వయసు 28 ఏళ్లు. గత రెండేళ్లుగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఈ మాజీ బ్యూటీ క్వీన్ చివరకు ఆ వ్యాధితో కన్నుమూసింది. రింకీకి ఊపిరితిత్తులు, తలలో క్యాన్సర్ సోకడంతో బ్రెయిన్ ట్యూమర్ ఏర్పడింది. ఊపిరితిత్తులు పనిచేయకపోవడంతో రింకీని సాకేత్ లోని మ్యాక్స్ ఆస్పత్రిలోని ఐసీయూలో చేర్పించారు.

నివేదికల ప్రకారం.. ఆమెను వెంటిలేటర్ పై ఉంచారు. దురదృష్టవశాత్తూ ఆమె ఆరోగ్యం క్షీణించడంతో రింకీ తుది శ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు, అంతిమ సంస్కారాలకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. మిస్ ఇండియా ఆర్గనైజేషన్ ఇటీవల సోషల్ మీడియా పోస్ట్ ద్వారా విచారాన్ని వ్యక్తం చేసింది. “ఒక అసాధారణ మహిళ, రింకీ నిజంగా శక్తివంతురాలు. అందరి పట్ల దయగల మనిషి అని పేర్కొంది. ఈ పోటీలో మిస్ బ్యూటీ విత్ ఏ పర్పస్ అనే బిరుదుతో సత్కరించినట్లు తెలిపింది.

2022లో తనకు ప్రాణాంతక ఫైలోడెస్ ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని జనవరిలో రింకీ ఇన్స్టాగ్రామ్లో పేర్కొంది. కీమోథెరపీ చేయించుకున్న ఆమె బ్రెయిన్ సర్జరీ కూడా చేయించుకోవాలని భావించింది. తాను, తన కుటుంబంతో కలిసి ఛాలెంజింగ్ ను ఎదుర్కొంటున్నానని, గత రెండేళ్లు తరచుగా ఆసుపత్రిలో చేరడం చాలా కష్టంగా ఉందని రింకీ తన అభిమానులకు తెలిపింది.

తన కుటుంబ పొదుపు మొత్తాన్ని చికిత్సకు వినియోగిస్తున్నందున విరాళాలు స్వీకరిస్తున్నట్లు రింకీ తెలిపారు. వాటిని రిసీవ్ చేసుకోవడానికి తాను చాలా బలహీనంగా ఉన్నానని, తనకు కాల్ చేయడానికి బదులుగా సందేశం పంపాలని ఆమె తన శ్రేయోభిలాషులను కోరింది. మీ ప్రార్థనల్లో నన్ను స్మరించుకోండి. ప్రతి ఒక్కరికీ ప్రేమను, స్వస్థతను పంచుతోంది’ అని రింకీ రాసుకొచ్చారు. అయితే చినవయసులోనే చనిపోవడం విషాదం నింపింది.

వాస్తు ప్రకారం ఈ వస్తువులను ఇంట్లో ఉంచుకోవద్దు.. ఎందుకంటే..
వాస్తు ప్రకారం ఈ వస్తువులను ఇంట్లో ఉంచుకోవద్దు.. ఎందుకంటే..
ఈ కొమ్మలతో దంతాలను శుభ్రం చేసుకోండి.. మెరిసే దంతాలు మీ సొంతం..
ఈ కొమ్మలతో దంతాలను శుభ్రం చేసుకోండి.. మెరిసే దంతాలు మీ సొంతం..
ప్రతి రోజూ మీరు టీ ఎలా తాగుతున్నారు..?
ప్రతి రోజూ మీరు టీ ఎలా తాగుతున్నారు..?
లేడీ అఘోరీ చెర నుంచి శ్రీవర్షిణికి విముక్తి..
లేడీ అఘోరీ చెర నుంచి శ్రీవర్షిణికి విముక్తి..
పోలీస్‌స్టేషన్‌లో మంటలు.. కళ్లముందే కాలిబూడిదైన కార్లు, బైకులు..!
పోలీస్‌స్టేషన్‌లో మంటలు.. కళ్లముందే కాలిబూడిదైన కార్లు, బైకులు..!
నువ్వు చూసి వెళ్ళిపోతావు.. నీకు కనపడని దృశ్యంలా నేను మిగిలిపోతాను
నువ్వు చూసి వెళ్ళిపోతావు.. నీకు కనపడని దృశ్యంలా నేను మిగిలిపోతాను
క్రికెట్‌ బెట్టింగ్‌తో అప్పులపాలై యువకుడి ఆత్మహత్య
క్రికెట్‌ బెట్టింగ్‌తో అప్పులపాలై యువకుడి ఆత్మహత్య
రీఎంట్రీ ఇస్తోన్న స్టార్ హీరోయిన్.. సుడిగాలి సుధీర్ స్పెషల్ ‏సాంగ
రీఎంట్రీ ఇస్తోన్న స్టార్ హీరోయిన్.. సుడిగాలి సుధీర్ స్పెషల్ ‏సాంగ
జగమంతా రామమయం.. శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి
జగమంతా రామమయం.. శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి
హైదరాబాద్‌కు కదిలి వచ్చిన అయోధ్యరామమందిరం..ఆసక్తిగా చూసిన భక్తులు
హైదరాబాద్‌కు కదిలి వచ్చిన అయోధ్యరామమందిరం..ఆసక్తిగా చూసిన భక్తులు