Pooja hegde: ‘ఏంటమ్నా’ సాంగ్‌ కాంట్రవర్సీపై పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు..

అందాల బుట్ట బొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘కిసీ కా బాయ్‌ కిసీ కీ జాన్‌’ అనే మూవీలో నటిస్తోన్న విషయం తెలిసిందే. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 21వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవల సరైన సక్సెస్‌ లేక బాధపడుతోన్న పూజా హెగ్డే కూడా ఈ సినిమాపైనే...

Pooja hegde: 'ఏంటమ్నా' సాంగ్‌ కాంట్రవర్సీపై పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు..
Pooja
Follow us

|

Updated on: Apr 15, 2023 | 5:38 PM

అందాల బుట్ట బొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘కిసీ కా బాయ్‌ కిసీ కీ జాన్‌’ అనే మూవీలో నటిస్తోన్న విషయం తెలిసిందే. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 21వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవల సరైన సక్సెస్‌ లేక బాధపడుతోన్న పూజా హెగ్డే కూడా ఈ సినిమాపైనే తన ఆశలన్నీ పెట్టుకుంది. ఈ చిత్రంతో బాలీవుడ్‌లో ఆఫర్లను కొట్టేయాలనే ప్లాన్‌లో ఉంది పూజా.

ప్రస్తుతం పూజా ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ‘కిసీ కా బాయ్‌ కిసీ కా జాన్‌’ సినిమాలోని ‘ఏంటమ్మా’ పాట చుట్టూ కాంట్రవర్సీ నెలకొన్న విషం తెలిసిందే. ఈ పాటలో సల్మాన్‌ ఖాన్‌తో పాటు వెంకటేష్‌, రామ్‌ చరణ్‌లు సైతం తళుక్కుమన్నారు. ఈ క్రమంలోనే ఇందులో హీరోలు పంచ ధరించారు. అయితే ఇది తమిళనాడు సంస్కృతి కాదు అంటూ కొందరు నెట్టింట కామెంట్‌ చేయడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం ఈ వివాదం కాస్త సద్దుమణిగింది. అయితే తాజాగా మీడియాతో మాట్లాడిన పూజా హెగ్డే ఈ పాట వివాదంపై రెస్పాండ్‌ అయ్యారు. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. ‘ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. మా సినిమాలో ఎంతోమంది దక్షిణాది నటీనటులు ఉన్నారు. ఆయా విషయాల్లో వారు కూడా శ్రద్ధ పెట్టారు. నేను కూడా ఒక దక్షిణాది అమ్మాయినే అయినందుకు గర్వపడుతున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..