నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లెకు చెందిన సుంకమ్మ మతిస్థిమితం కోల్పోయి, నిత్యం చెత్తను ఏరి డస్ట్బిన్లో వేస్తూ స్వచ్ఛతకు కృషి చేస్తోంది. ఆమె నిస్వార్థ సేవను గుర్తించిన ఒక వస్త్ర దుకాణ యజమాని తన కొత్త షాపు ప్రారంభోత్సవానికి ఆమెను ముఖ్య అతిథిగా ఆహ్వానించి గౌరవించారు. ఆమెను నిజమైన వీఐపీగా కొనియాడారు.