POLICE: యువతిని గదిలో బంధించిన పోలీసు.. 40రోజుల పాటు చిత్రహింసలు

తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ యువతిపై ఏఎస్ఐ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో దుష్ట నివారణ పూజలు జరిపిస్తానని నమ్మించి 40 రోజులు ఇంట్లో బంధించి చిత్ర హింసలు పెట్టాడు.

POLICE: యువతిని గదిలో బంధించిన పోలీసు.. 40రోజుల పాటు చిత్రహింసలు
Harrasment
Follow us

|

Updated on: Feb 06, 2022 | 5:53 PM

తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ యువతిపై ఏఎస్ఐ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో దుష్ట నివారణ పూజలు జరిపిస్తానని నమ్మించి 40 రోజులు ఇంట్లో బంధించి చిత్ర హింసలు పెట్టాడు. అతడి బారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న యువతి ఏఎస్ఐ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. పోలీసు ఉన్నతాధికారులు తెలిపిన వివరాలు ప్రకారం తమిళనాడు పళ్లికరణైలో ఓ యువతి నివసిస్తోంది. విదేశాల్లో ఉన్న ఆమె తల్లిదండ్రులు ఇటీవలే మృతి చెందడంతో ఆమె ఒంటరిగా జీవనం సాగిస్తోంది. మిస్ చెన్నై పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరూ తెచ్చుకుంది.

ఈస్ట్‌ కోస్టు రోడ్డులో ఆమెకు చెందిన సొంత స్థలంలో ఇంటిని నిర్మిస్తామని ఓ బిల్డర్ మోసం చేశాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సదరు యువతి పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అక్కడ ఏఎస్‌ఐ ఆండ్రూ కార్వెల్‌‌తో పరిచయం ఏర్పడింది. కేసు విచారణ పేరుతో రోజూ ఆమెతో మాట్లాడుతూ పరిచయం పెంచుకున్నాడు. ఏఎస్ఐని నమ్మిన యువతి.. తన వ్యక్తిగత విషయాలనూ పంచుకుంది. తన ఇంట్లో సమస్యలు ఉన్నాయని, అందుకే తన తల్లిదండ్రులు అనారోగ్యంతో చనిపోయారని అతని వద్ద వాపోయింది.

ఆమె బలహీనతను అవకాశంగా తీసుకున్న కార్వెల్.. దుష్ట నివారణ పూజలు చేయిస్తానని నమ్మించాడు. తర్వాత కొంత మంది మత బోధకులను పిలిపించి పూజలు చేయించాడు. ఓ రోజు ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వెళ్లి యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆమె తిరస్కరించడంతో గదిలో బంధించి 40 రోజుల పాటు చిత్రహింసలు పెట్టాడు. అతడి బారి నుంచి బాధితురాలు ఎలాగోలా బయటపడి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో ఉన్నతాధికారులు విచారణ జరిపి కార్వెల్ పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న కార్వెల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇవీచదవండి.

Hyderabad News: అమ్మో.. ఈ దంపతులు మహా ముదుర్లు.. నమ్మించే నట్టేట ముంచారు.. ఏకంగా 2 కోట్లు..

Viral Video: అయ్యో పాపం.. ఎరక్కపోయి వచ్చి… ఇరుక్కుపోయింది

Telangana: లబోదిబోమంటున్న తెలంగాణ వేరుశనగ రైతులు.. పట్టించుకునే నాథుడేడి..?

Latest Articles
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
తెలంగాణ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ 1st ఇయర్‌ ఉచిత ప్రవేశాలు
తెలంగాణ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ 1st ఇయర్‌ ఉచిత ప్రవేశాలు
ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. స్వల్పకాలిక ఎఫ్డీలపై వడ్డీ పెంపు..
ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. స్వల్పకాలిక ఎఫ్డీలపై వడ్డీ పెంపు..
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి