AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: అర్థరాత్రి ఉలిక్కిపడ్డ ఢిల్లీ.. ఇంట్లో టీవీ చూస్తున్న వారిపై తుపాకీతో కాల్పులు.. ఇద్దరు మృతి

దేశ రాజధాని ఢిల్లీ (Delhi) కాల్పుల మోతతో దద్దరిల్లింది. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో చిగురుటాకులా వణికిపోయింది. జేజే కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు...

Delhi: అర్థరాత్రి ఉలిక్కిపడ్డ ఢిల్లీ.. ఇంట్లో టీవీ చూస్తున్న వారిపై తుపాకీతో కాల్పులు.. ఇద్దరు మృతి
Gun Firing
Ganesh Mudavath
|

Updated on: Aug 23, 2022 | 12:10 PM

Share

దేశ రాజధాని ఢిల్లీ (Delhi) కాల్పుల మోతతో దద్దరిల్లింది. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో చిగురుటాకులా వణికిపోయింది. జేజే కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముఖానికి మాస్కులతో వచ్చిన ఇద్దరు వ్యక్తులు జేజే కాలనీలోని ఓ ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో టీవీ చూస్తున్న ముగ్గురు వ్యక్తులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు.

కాగా.. మే నెలలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. పశ్చిమ ఢిల్లీలోని సుభాష్‌ నగర్‌లో (Subhash Nagar) దుండగులు 10 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. జనావాసాల్లో కాల్పులు జరపడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సీసీ ఫుటేజ్‌లో రికార్డైన దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఏప్రిల్ 16న నార్త్ వెస్ట్ ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో జరిగిన ఘర్షణల తర్వాత పశ్చిమ ఢిల్లీలో కాల్పుల ఘటన కొన్ని వారాల తర్వాత తెరపైకి వచ్చింది. ఈ హింసాకాండలో పోలీసులతో పాటు పలువురు గాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్.. ఆ డబ్బు కోసం మూడేళ్లు ఆగాల్సిందే..
ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్.. ఆ డబ్బు కోసం మూడేళ్లు ఆగాల్సిందే..
వర్షాకాలంలో ఈ తప్పులు చేయొద్దు.. ప్రాణాలకే ప్రమాదం!
వర్షాకాలంలో ఈ తప్పులు చేయొద్దు.. ప్రాణాలకే ప్రమాదం!
గోదావరి నదిలో ఇసుక నుంచి బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన జనం..
గోదావరి నదిలో ఇసుక నుంచి బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన జనం..
ద్రాక్ష పండ్లను కేవలం నీటితో కడిగితే సరిపోదు.. ఇలా శుభ్రం చేయండి
ద్రాక్ష పండ్లను కేవలం నీటితో కడిగితే సరిపోదు.. ఇలా శుభ్రం చేయండి
ఖరీదైన మేకప్ కిట్స్ వద్దు.. చర్మ సౌందర్యానికి ఇదొక్కటి చాలు
ఖరీదైన మేకప్ కిట్స్ వద్దు.. చర్మ సౌందర్యానికి ఇదొక్కటి చాలు
టిష్యూ పేపర్లు తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి? అసలు సీక్రెట్‌ ఇదే
టిష్యూ పేపర్లు తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి? అసలు సీక్రెట్‌ ఇదే
పార్శిల్ క్యాన్సిల్ చేసుకుంటే ఇకపై రీఫండ్ పొందే అవకాశం..
పార్శిల్ క్యాన్సిల్ చేసుకుంటే ఇకపై రీఫండ్ పొందే అవకాశం..
9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. సీసీ కెమెరాల్లో చూసి ఆగ్రహించిన..
9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. సీసీ కెమెరాల్లో చూసి ఆగ్రహించిన..
సంపద సృష్టికి వారెన్ బఫెట్ చెప్పిన సీక్రెట్స్
సంపద సృష్టికి వారెన్ బఫెట్ చెప్పిన సీక్రెట్స్
రోహిత్ బాటలోనే కోహ్లీ.. వన్డే ప్రపంచ కప్‌నకు ముందే రిటైర్మెంట్..?
రోహిత్ బాటలోనే కోహ్లీ.. వన్డే ప్రపంచ కప్‌నకు ముందే రిటైర్మెంట్..?