AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ వాసుల మ‌ృతి

క‌ర్ణాట‌క‌లో ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. రాయ‌చూర్ స‌మీపంలో జ‌రిగిన ప్ర‌మాదంలో ఇద్ద‌రు తెలంగాణ వాసులు మృత్యువాత‌ప‌డ్డారు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వివ‌రాల్లోకి వెళితే.. గద్వాల జిల్లా కేటీ దొడ్డికి చెందిన గోపాల్ అనే వ్య‌క్తి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా బెంగళూరు నుంచి గురువారం ఉదయం కారులో సొంత గ్రామానికి బయలుదేరారు. రాయచూర్ జిల్లా మాన్వి సమీపంలోకి రాగానే వీరి కారు అదుపుతప్పి బలంగా చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌తో […]

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ వాసుల మ‌ృతి
Jyothi Gadda
|

Updated on: Apr 30, 2020 | 1:19 PM

Share
క‌ర్ణాట‌క‌లో ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. రాయ‌చూర్ స‌మీపంలో జ‌రిగిన ప్ర‌మాదంలో ఇద్ద‌రు తెలంగాణ వాసులు మృత్యువాత‌ప‌డ్డారు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వివ‌రాల్లోకి వెళితే..
గద్వాల జిల్లా కేటీ దొడ్డికి చెందిన గోపాల్ అనే వ్య‌క్తి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా బెంగళూరు నుంచి గురువారం ఉదయం కారులో సొంత గ్రామానికి బయలుదేరారు. రాయచూర్ జిల్లా మాన్వి సమీపంలోకి రాగానే వీరి కారు అదుపుతప్పి బలంగా చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌తో పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గోపాల్ అక్కడికక్కడే చనిపోయారు. కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గ‌మ‌నించి 108కి కాల్‌చేసి స‌మాచారం ఇచ్చారు. గాయపడిన మహిళలను చికిత్స కోసం రాయచూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబీకుల‌కు స‌మాచారం అంద‌జేశారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.