Vizag: గ్రామస్తుల రాళ్ల దాడి.. పోలీసుల ఫైరింగ్.. లంబసింగి ఘాట్ రోడ్డులో అసలేం జరిగింది

విశాఖ మన్యం చింతపల్లి మండలం, లంబసింగి ఘాట్ రోడ్డులో హైడ్రామా నడిచింది. నల్గొండ టాస్క్ ఫోర్స్ పోలీసులు, గ్రామస్తుల మధ్య వివాదం చెలరేగింది.

Vizag: గ్రామస్తుల రాళ్ల దాడి.. పోలీసుల ఫైరింగ్.. లంబసింగి ఘాట్ రోడ్డులో అసలేం జరిగింది
Vizag Police Firing
Follow us

|

Updated on: Oct 18, 2021 | 6:58 AM

విశాఖ మన్యం చింతపల్లి మండలం, లంబసింగి ఘాట్ రోడ్డులో హైడ్రామా నడిచింది. నల్గొండ టాస్క్ ఫోర్స్ పోలీసులు, గ్రామస్తుల మధ్య వివాదం చెలరేగింది. చివరికి రాళ్లు గాల్లోకి లేచాయ్.. తుపాకుల మోతలు మోగాయి. మూడు రోజుల క్రితం బాలకృష్ణ అనే వ్యక్తి ఆచూకీ కోసం వచ్చి.. గాలిపాడుకు చెందిన భీమయ్యను తీసుకుని వెళ్లారు నల్గొండ టాస్క్ ఫోర్స్ పోలీసులు. మూడు రోజులుగా అతని ఆచూకీ తెలియకపోవడంతో.. స్థానిక అన్నవరం పోలీసులకు గ్రామస్తులు ఫిర్యాదు చేసారు.

భీమయ్యను తీసుకుని ఇవాళ గాలిపాడు వెళ్తుండగా.. అదే సమయంలో అన్నవరంలో ఉన్న గ్రామస్తులు వెంబడించారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు వెనుదిరిగినా.. వారిని ఫాలో అయ్యారు. కొంత దూరం వెళ్లాక లారీ అడ్డురావడంతో టాస్క్ ఫోర్స్ పోలీసుల వాహనాలు నిలిపివేశారు. దీంతో గ్రామస్తులు ఒక్కసారిగా దాడిచేసేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో తమని తాము కాపాడుకునేందుకు పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది.

ఈ ఘటనలో కిల్లో రాంబాబు, కామరాజుకు బుల్లెట్లు తగిలాయి. వారిని నర్సీపట్నం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే గాలిలోకి మాత్రమే కాల్పులు జరిపామన్నది పోలీసుల వాదన. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లంబ సింగి ఘాట్ రోడ్ లో డౌనూరు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్థానిక పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నల్గొండ టాస్క్ ఫోర్స్ పోలీసులు విశాఖమన్యంలోకి ఎందుకు వెళ్లారు.. బాలకృష్ణ కోసం ఎందుకు వెతుకుతున్నారు.. భీమయ్యను మూడు రోజుల పాటు ఎక్కడికి తీసుకెళ్లారనేది తెలియాల్సి ఉంది. కాగా నల్గొండ పోలీసులు.. లోకల్ పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. గంజాయి కేసులోనే భీమయ్యను నల్గొండ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రాథమికంగా తెలిసింది.

Also Read: మహానటిని మించిపోయింది.. భర్త కనిపించడం లేదని ఫిర్యాదు.. అసలు నిజం తెలిస్తే షాకే

మంచిర్యాల జిల్లాలో ఘోర ప్రమాదం.. క్షణాల్లో మాంసపు ముద్దలుగా తల్లీ, కొడుకు

ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు
అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు
పరగడుపునే టీ తాగడం అంత ప్రమాదమా ?? నిపుణులేమంటున్నారు ??
పరగడుపునే టీ తాగడం అంత ప్రమాదమా ?? నిపుణులేమంటున్నారు ??
ఓం భీమ్ బుష్‌లో సంపంగి దెయ్యంగా నటించింది ఎవరో తెలుసా..?
ఓం భీమ్ బుష్‌లో సంపంగి దెయ్యంగా నటించింది ఎవరో తెలుసా..?
ప్రభాస్‌ 35లక్షల విరాళం ఇచ్చినట్టుగా ప్రకటించిన డైరెక్టర్‌ మారుతి
ప్రభాస్‌ 35లక్షల విరాళం ఇచ్చినట్టుగా ప్రకటించిన డైరెక్టర్‌ మారుతి
మహిళలూ ఇది మీకే.. భర్తలు భార్యల నుంచి కోరుకునేది ఇవేనట..
మహిళలూ ఇది మీకే.. భర్తలు భార్యల నుంచి కోరుకునేది ఇవేనట..
గంపతో నామినేషన్ వేసేందుకు వెళ్లిన మహిళ.. అధికారులకు ముచ్చెమటలు..
గంపతో నామినేషన్ వేసేందుకు వెళ్లిన మహిళ.. అధికారులకు ముచ్చెమటలు..