Telangana: ఓ పురాతన గడీ నుంచి పట్టపగలు పెద్ద, పెద్ద శబ్ధాలు.. స్థానికులు వెళ్లి చూడగా షాక్…

నిజామాబాద్‌ జిల్లాలో గుప్త నిధుల తవ్వకం కలకలం రేపింది. సిరికొండ మండలం పెద్దవాల్గోట్‌లో గుప్త నిధుల కోసం కొందరు దుండగులు తవ్వకాలు చేపట్టారు.

Telangana: ఓ పురాతన గడీ నుంచి పట్టపగలు పెద్ద, పెద్ద శబ్ధాలు.. స్థానికులు వెళ్లి చూడగా షాక్...
Treasure Hunt
Follow us

|

Updated on: Mar 13, 2021 | 5:58 PM

Treasure hunt:  నిజామాబాద్‌ జిల్లాలో గుప్త నిధుల తవ్వకం కలకలం రేపింది. సిరికొండ మండలం పెద్దవాల్గోట్‌లో గుప్త నిధుల కోసం కొందరు దుండగులు తవ్వకాలు చేపట్టారు. ఓ పురాతన గడీలో గుప్తనిధులు ఉన్నట్లు భావించిన గుర్తు తెలియని వ్యక్తులు గుట్టుగా వేట మొదలుపెట్టారు.

పెద్ద వాల్గొట్ గ్రామంలోని పురాతన గడీలో గుప్త నిధుల కోసం ఓ ఇంట్లో తవ్వకాలు నిర్వహించారు. ఇంట్లోంచి పెద్దగా శబ్ధాలు రావడంతో అటుగా వచ్చిన గ్రామస్తులు…నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో గుప్తనిధుల కోసం వేటగాళ్లు గుళ్లు, గోపురాలు, పాడుబడ్డ పురాతన భవనాలను టార్గెట్‌గా చేసుకుని తవ్వకాలు జరుపుతున్నట్లుగా పోలీసులు తెలిపారు. అటువంటి వారి వివరాలు తెలిస్తే..వెంటనే తమకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

ఇటీవల శివరాత్రి రోజు కూడా…

మహాశివరాత్రి రోజున నారాయణపేట జిల్లాలో గుప్తనిధుల కలకలం రేపింది. అప్పిరెడ్డిపల్లి గ్రామ శివారులోని ఓ పురాతన రామాలయంలో సన్నిధిలో గుర్తు తెలియని వ్యక్తులు..గుప్తనిధుల తవ్వకాలు జరిపినట్లు ఆనవాళ్లు గుర్తించారు ఇక్కడి స్థానికులు.

నారాయణపేట జిల్లా నారాయణపేట మండలానికి చెందిన అప్పిరెడ్డిపల్లి గ్రామ శివారులో ఉంది ఈ పురాతన రామదేవుడి మందిరం. మహా శివరాత్రి సందర్బంగా ఇక్కడి ఆలయంలో పూజలు చేయడానికి వచ్చిన స్థానికులు ఆలయ సమీపంలో భారీ గుంతను గుర్తించారు. మందిరం ముందు భాగంలో సుమారు 10 ఫీట్ల లోతైన గుంతలు కనిపించాయి. అవి చూసి స్థానికులు ఒక్కసారిగా కంగుతిన్నారు. సమీపంలోనే గుప్తనిధుల తవ్వకాల కోసం పూజకు అవసరమైన సామాగ్రి, గుమ్మడి కాయలు ఉండటం గమనించారు. ఇదంతా చూసిన గ్రామస్తులు ఇక్కడ గుర్తు తెలియని వ్యక్తులు..గుప్తనిధుల కోసమే ఈ భారీ గుంతను తవ్వినట్లుగా అనుమానిస్తున్నారు.అయితే, ఈ గుంత అడుగు భాగంలో మరో కట్టడం ఉన్నట్లుగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక్కడ నిధులు దొరికి ఉండవచ్చని లేదంటే…మరో మందిరం ఆనవాళ్లు కనపడడంతో తవ్వడానికి వీలు కాకపోవటంతో దుండగులు పారిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి ఆలయంలో తవ్వకాలు జరపడం ఇది రెండోసారి అంటున్నారు స్థానిక ప్రజలు.

Also Read:

AP Corona: ఏపీలో మళ్లీ కరోనా కల్లోలం.. ముఖ్యంగా ఆ జిల్లాలో.. మళ్లీ రెడ్ జోన్లు ప్రకటించిన అధికారులు

ఆ ప్రాంతాల్లో వానర వనాలుగా మారిన ఊర్లు.. జనాభా కంటే కోతులే ఎక్కువయ్యాయి.. జనాల్ని టార్చెర్ చేస్తున్నాయి

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు