AP Corona: ఏపీలో మళ్లీ కరోనా కల్లోలం.. ముఖ్యంగా ఆ జిల్లాలో.. మళ్లీ రెడ్ జోన్లు ప్రకటించిన అధికారులు

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భారీగా కరోనా వైరస్ కేసులు పెరిగాయి. ఇటీవలి కాలంలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలను వైరస్‌ వణికిస్తోంది.

AP Corona:  ఏపీలో మళ్లీ కరోనా కల్లోలం.. ముఖ్యంగా ఆ జిల్లాలో.. మళ్లీ రెడ్ జోన్లు ప్రకటించిన అధికారులు
Andhra Pradesh Corona Updates
Follow us

|

Updated on: Mar 13, 2021 | 4:05 PM

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భారీగా కరోనా వైరస్ కేసులు పెరిగాయి. ఇటీవలి కాలంలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలను వైరస్‌ వణికిస్తోంది. కొత్తగా ఒక్క తీర్పుగోదావరి జిల్లాలోనే 41 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని ఒక్క అమలాపురం డివిజన్‌లోనే 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుపయ్య అగ్రహారం 18వ వార్డులో హైద్రబాద్ నుండి వచ్చిన ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో  ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించారు అధికారులు.

అటు మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం లో దుబాయ్ నుండి వచ్చిన 40 ఏళ్ల మహిళ కరోనాతో మృతి చెందడంతో కోనసీమవాసులు భయాందోళనలో పడ్డారు. మలికిపురం యుపి స్కూల్ లో ఆరుగురికి కరోనా పాజిటివ్‌ తేలింది. వీరిలో నలుగురు ఉపాధ్యాయులు, ఒక వంటమనిషి ఉన్నారు. తుని పట్టణంలో 5 నెలల గర్భిణికి కరోనా సోకింది. పిఠాపురంలో రెండు కరోన కేసులు నమోదు కాగా, కొత్తపేట మండలం వానపల్లిలో ఒకే కుటుంబంలో నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ముందస్తు జాగ్రత్తగా 50 మీటర్ల పరిధిలో కంటోన్మెంట్ జోన్ ఏర్పాటు చేశారు అధికారులు.

అటు విశాఖలోని గోపాలపట్నం జడ్పీ హైస్కూల్‌లో కరోనా వైరస్ కలకలం రేపింది. స్కూల్‌లో నలుగురు విద్యార్థులకు వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు, సిబ్బంది తరగతి గదులు, పరసరాలను శానిటైజేషన్‌ చేయించారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ఇప్పటికే పలు చర్యలను ప్రారంభించింది. అయినప్పటికీ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అటు ప్రభుత్వంలో.. ఇటు ప్రజల్లో ఆందోళన మొదలైంది.

కాగా మహమ్మారి కరోనా వైరస్ మరోసారి విస్తరిస్తున్న క్రమంలో జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు సూచిస్తున్నారు. భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం తప్పనిసరి అని చెబుతున్నారు. చేతుల్ని ఎప్పుటికప్పుడు శానిటైజ్ చేసుకోవాలని, గుంపులు గుంపులుగా కలిసి ఉండొద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్దులు విషయంలో అత్యంత జాగ్రత్త అవసరమని హెచ్చరిస్తున్నారు.

Also Read:

JR NTR Political Entry: నందమూరి చిన్నోడి పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు..? ఆయన సమాధానం ఇదే..

మోదీ సర్కార్ పెన్షన్ స్కీం.. నెలకు రూ. 3 వేలు పెన్షన్ పొందండి.. నమోదు చేసుకోండిలా.!

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..