JR NTR Political Entry: నందమూరి చిన్నోడి పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు..? ఆయన సమాధానం ఇదే..

తెలుగుదేశం.. తెలుగువారి ఆత్మగౌరవమే పునాదిగా పుట్టిన పార్టీ. తెలుగు తెరపై తిరుగులేని రారాజుగా నిలిచిన అన్న ఎన్టీఆర్.. తెలుగుదేశాన్ని స్థాపించి 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు.

JR NTR Political Entry: నందమూరి చిన్నోడి పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు..? ఆయన సమాధానం ఇదే..
Jr Ntr
Follow us

|

Updated on: Mar 13, 2021 | 3:45 PM

తెలుగుదేశం.. తెలుగువారి ఆత్మగౌరవమే పునాదిగా పుట్టిన పార్టీ. తెలుగు తెరపై తిరుగులేని రారాజుగా నిలిచిన అన్న ఎన్టీఆర్.. తెలుగుదేశాన్ని స్థాపించి 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. ఆయన ఆవేశపూరిత ప్రసంగాలు ఇప్పటికీ తెలుగువారిని తట్టిలేపుతూనే ఉంటాయి. కాగా ఎంతో ఘనచరిత్ర ఉన్న టీడీపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో గడ్డుకాలాన్ని ఎదుర్కుంటుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో చరిత్రలో ఎరుగని ఓటమిని మూటగట్టుకున్న పార్టీ.. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా బొక్కబోర్లాపడింది. ఎవరూ ఊహించని విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాఖా కుప్పంలో కూడా పార్టీ ఓటమి పాలయ్యింది. దీంతో అటు నాయకులతో పాటు కార్యకర్తలు కూడా నైరాశ్యంలో ఉన్నారు. ఈ క్రమంలోనే తారక్ యాక్టీవ్ పాలిటిక్స్‌లోకి రావాలని అభిమానులతో పాటు పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అయితేనే పార్టీని తిరిగి గాడిలో పెట్టగలడని వారు బలంగా నమ్ముతున్నారు. ఇటీవలి కుప్పం పర్యటనలో కార్యకర్తలు బాహాటంగానే తారక్‌‌ను పార్టీలోకి తీసుకురావాలని అధినేతను కోరారు.

ఇదంతా ఓకే. అసలు తారక్ మనసులో ఏముంది. ఆయన యాక్టీవ్ పాలిటిక్స్‌లోకి ఎప్పుడు రావాలనుకుంటున్నారు. హీరోగా టాలీవుడ్‌లో అగ్రపథాన కొనసాగుతున్న సమయాన.. సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారా అన్నవి ఇప్పుడు అటు కార్యకర్తలు, అభిమానులను వేధిస్తున్న ప్రశ్నలు. ఇదే ప్రశ్నను తాజాగా ఓ జర్నలిస్ట్‌ తారక్‌కు సంధించారు. దానికి ఎన్టీఆర్ తన మార్క్ స్పందన ఇచ్చారు. గుట్టు విప్పకుండా స్వీట్‌గా సైడైపోయారు. మీరే చెప్పండి ఎప్పుడు రావాలో అని తొలుత తిరిగి ప్రశ్నించిన ఎన్టీఆర్.. ఇప్పుడు దాని గురించే మాట్లాడే సందర్భం కాదంటూ దాటవేశారు. మరోసారి కూర్చునీ కాఫీ తాగుతూ తీరిగ్గా మాట్లాడుకుందాం అని చెప్పారు. సో.. దీనిపై మరింతకాలం సస్పెన్స్ కొనసాగించాలని తారక్ డిసైడయ్యారని తెలుస్తుంది.

కాగా ఒక వర్గం అభిమానులు అయితే ఎన్టీఆర్‌ను రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరుతున్నారు. అటు బాలయ్య సీనియర్ అయిపోయారు, ఇటు మోక్షజ్ఞ ఎంట్రీ ఇంకా ఇవ్వలేదు. కళ్యాణ్ రామ్ కెరీర్ ఆశాజనకంగా సాగటంలేదు. ఈ క్రమంలో ఫక్తు నందమూరి కుటుంబ అభిమానులుగా తమకు ఎన్టీఆర్ ఇంకొంతకాలం వెండితెరపైనే వినోదం పంచాలని కోరుతున్నారు. చూద్దాం తెలుగునాట నందమూరి చిన్నోడి ప్రయాణం మున్ముందు ఎలా సాగుతుందో.

Also Read:

ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌ వెళ్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో పెద్ద ఎత్తున మంటలు, పలు బోగీలు దగ్ధం

సెల్ఫీ వీడియో కోసం ట్రై చేసిన యువతి.. ఓ ఆటాడుకున్న పొట్టేలు… నవ్వులు పూయిస్తున్న వీడియో..

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు