AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంత ఘోరమా.. ముగ్గురు మహిళలను అర్ధనగ్నంగా ఊరేగించి..!

కరోనా కట్టడిలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ.. బీహార్‌లో ఆటవిక చర్యలు కలకలం సృష్టించాయి. రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. మంత్రగత్తెలన్న నెపంతో ముగ్గురు మహిళలను చిత్రంహింసలకు గురిచేశారు డక్రామా గ్రామినికి చెందిన గ్రామస్ధులు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ముజఫర్‌ పూర్‌లోని డక్రమా గ్రామంలో ముగ్గురు మహిళల్ని మంత్రగత్తెలన్న నెపంతో గ్రామస్థులు దాడికి పాల్పడ్డట్లు తెలిపారు. బాధిత మహిళలతో తమకు ప్రమాదమంటూ పుకార్లు లేపిన […]

ఇంత ఘోరమా.. ముగ్గురు మహిళలను అర్ధనగ్నంగా ఊరేగించి..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 06, 2020 | 6:17 PM

Share

కరోనా కట్టడిలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ.. బీహార్‌లో ఆటవిక చర్యలు కలకలం సృష్టించాయి. రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. మంత్రగత్తెలన్న నెపంతో ముగ్గురు మహిళలను చిత్రంహింసలకు గురిచేశారు డక్రామా గ్రామినికి చెందిన గ్రామస్ధులు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ముజఫర్‌ పూర్‌లోని డక్రమా గ్రామంలో ముగ్గురు మహిళల్ని మంత్రగత్తెలన్న నెపంతో గ్రామస్థులు దాడికి పాల్పడ్డట్లు తెలిపారు. బాధిత మహిళలతో తమకు ప్రమాదమంటూ పుకార్లు లేపిన కొందరు.. గ్రామస్ధులందర్నీ ఏకం చేసి.. దాడికి దిగారు. ఆ ముగ్గురు మహిళలకు గుండుగీయించి.. అంతటితో ఆగకుండా.. వారిని అర్ధనగ్నంగా ఊరేగిస్తూ.. పైశాచికానందాన్ని పొందారు. అంతేకాదు.. వారితో చెప్పలేని విధంగా పనులు చేయించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో స్థానికంగా అక్కడ వైరల్‌ కావడంతో.. పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు చేపడతామన్నారు.