AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: భారీ పతనం.. రూ.19 వేలు తగ్గిన బంగారం ధర.. వెండి రూ.55 వేలు.. తులం ధర రూ.1 లక్షకు చేరుతుందా?

Gold Price: బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో పతనం అవుతున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో బంగారం ధరలపై తీవ్ర ప్రభావం పడుతోంది. పడిసి ఔన్స్‌ 4,574.90 డాలర్లకు పతనం అవుతోంది. వెండి 3వ వారంలో 15 శాతం క్షిణించి వెండి ఔన్స్‌ 69.66 డాలర్లుగా నమోదవుతోంది. బంగారం, వెండి ధరలు అత్యంత భారీగా పడిపోతున్నాయి.

Subhash Goud
|

Updated on: Mar 23, 2026 | 10:24 AM

Share
Gold Price: బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో పతనం అవుతున్నాయి. చరిత్రలో ఎన్నడు లేని విధంగా దిగి వస్తున్నాయి. అంతర్జాతీయంగా వారంలోనే పసిడి 10 శాతం, వెండి 15 శాతం క్షిణించింది. 2011 తర్వాత బంగారానికి ఒక వారంలో అధిక నష్టం వాటిల్లింది. ఇక 2026 ఫిబ్రవరి 27న ఇరాన్ యుద్ధం ప్రారంభం కావడానికి కేవలం ఒక రోజు ముందు భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ.1.59 లక్షలుగా ఉండేది. అయితే యుద్ధం ప్రారంభమైన 22వ రోజు మార్చి 21 నాటికి, దాని ధర దాదాపు 8% తగ్గి రూ.1.47 లక్షలకు పడిపోయింది. అదే మార్చి 23న తులం బంగారంపై ఏకంగా రూ.5,950 తగ్గింది. ప్రస్తుతం తులం బంగారం ధర రూ.1,40,020 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు దాదాపు 14% తగ్గి, ఔన్సుకు $4,488కి చేరాయి. ఈ ధోరణి కొద్దిగా భిన్నంగా ఉంది. ఎందుకంటే సాధారణంగా యుద్ధ సమయాల్లో బంగారం ధరలు పెరుగుతాయి.

Gold Price: బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో పతనం అవుతున్నాయి. చరిత్రలో ఎన్నడు లేని విధంగా దిగి వస్తున్నాయి. అంతర్జాతీయంగా వారంలోనే పసిడి 10 శాతం, వెండి 15 శాతం క్షిణించింది. 2011 తర్వాత బంగారానికి ఒక వారంలో అధిక నష్టం వాటిల్లింది. ఇక 2026 ఫిబ్రవరి 27న ఇరాన్ యుద్ధం ప్రారంభం కావడానికి కేవలం ఒక రోజు ముందు భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ.1.59 లక్షలుగా ఉండేది. అయితే యుద్ధం ప్రారంభమైన 22వ రోజు మార్చి 21 నాటికి, దాని ధర దాదాపు 8% తగ్గి రూ.1.47 లక్షలకు పడిపోయింది. అదే మార్చి 23న తులం బంగారంపై ఏకంగా రూ.5,950 తగ్గింది. ప్రస్తుతం తులం బంగారం ధర రూ.1,40,020 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు దాదాపు 14% తగ్గి, ఔన్సుకు $4,488కి చేరాయి. ఈ ధోరణి కొద్దిగా భిన్నంగా ఉంది. ఎందుకంటే సాధారణంగా యుద్ధ సమయాల్లో బంగారం ధరలు పెరుగుతాయి.

1 / 6
 బంగారం ఎల్లప్పుడూ సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు. యుద్ధం లేదా అనిశ్చితి ఉన్నప్పుడల్లా ప్రజలు బంగారంలో పెట్టుబడి పెడతారు. దీనివల్ల ధరలు పెరుగుతాయి. ఉదాహరణకు 1990 గల్ఫ్ యుద్ధం, 2003 ఇరాక్ యుద్ధం సమయంలో బంగారం గణనీయమైన లాభాలను చూసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (2022) సమయంలో బంగారం ధర మొదట్లో పెరిగినా, తర్వాత పడిపోయింది.

బంగారం ఎల్లప్పుడూ సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు. యుద్ధం లేదా అనిశ్చితి ఉన్నప్పుడల్లా ప్రజలు బంగారంలో పెట్టుబడి పెడతారు. దీనివల్ల ధరలు పెరుగుతాయి. ఉదాహరణకు 1990 గల్ఫ్ యుద్ధం, 2003 ఇరాక్ యుద్ధం సమయంలో బంగారం గణనీయమైన లాభాలను చూసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (2022) సమయంలో బంగారం ధర మొదట్లో పెరిగినా, తర్వాత పడిపోయింది.

2 / 6
 ఈసారి బంగారం ధర ఎందుకు పడిపోతోంది?: ఈసారి బంగారం ధరలు తగ్గడానికి నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయి.  బలమైన డాలర్:  డాలర్ బలపడటం వల్ల బంగారం ఖరీదై, దానికి గిరాకీ తగ్గుతుంది. ఈసారి కూడా డాలర్ సూచీ పెరగడంతో పెట్టుబడిదారులు డాలర్లలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు.వడ్డీనిచ్చే పెట్టుబడులు మరింత ఆకర్షణీయంగా మారాయి: పెరుగుతున్న ముడిచమురు ధరలు ద్రవ్యోల్బణ భయాలను పెంచినప్పటికీ, కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచలేదు. దీనివల్ల డాలర్ బలపడి, బంగారంపై పెట్టుబడులు తగ్గాయి.

ఈసారి బంగారం ధర ఎందుకు పడిపోతోంది?: ఈసారి బంగారం ధరలు తగ్గడానికి నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయి. బలమైన డాలర్: డాలర్ బలపడటం వల్ల బంగారం ఖరీదై, దానికి గిరాకీ తగ్గుతుంది. ఈసారి కూడా డాలర్ సూచీ పెరగడంతో పెట్టుబడిదారులు డాలర్లలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు.వడ్డీనిచ్చే పెట్టుబడులు మరింత ఆకర్షణీయంగా మారాయి: పెరుగుతున్న ముడిచమురు ధరలు ద్రవ్యోల్బణ భయాలను పెంచినప్పటికీ, కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచలేదు. దీనివల్ల డాలర్ బలపడి, బంగారంపై పెట్టుబడులు తగ్గాయి.

3 / 6
 లాభాల స్వీకరణ: 2025లో బంగారం ధర సుమారు 74% పెరిగింది. పెట్టుబడిదారులు లాభాలను స్వీకరించడం ప్రారంభించడంతో ధరలపై ఒత్తిడి పెరిగింది. భారతదేశంలో బలహీనమైన డిమాండ్: అధిక ధరల కారణంగా వినియోగదారులు తమ కొనుగోళ్లను తగ్గించుకున్నారు. ముంబైలో ఆభరణాల అమ్మకాలు 75% మేర తగ్గినట్లు సమాచారం. అంతేకాకుండా, ఆభరణాల వ్యాపారులు కూడా తమ వద్ద నిల్వలు అధికంగా ఉండటం వల్ల కొత్త కొనుగోళ్లను తగ్గిస్తున్నారు.

లాభాల స్వీకరణ: 2025లో బంగారం ధర సుమారు 74% పెరిగింది. పెట్టుబడిదారులు లాభాలను స్వీకరించడం ప్రారంభించడంతో ధరలపై ఒత్తిడి పెరిగింది. భారతదేశంలో బలహీనమైన డిమాండ్: అధిక ధరల కారణంగా వినియోగదారులు తమ కొనుగోళ్లను తగ్గించుకున్నారు. ముంబైలో ఆభరణాల అమ్మకాలు 75% మేర తగ్గినట్లు సమాచారం. అంతేకాకుండా, ఆభరణాల వ్యాపారులు కూడా తమ వద్ద నిల్వలు అధికంగా ఉండటం వల్ల కొత్త కొనుగోళ్లను తగ్గిస్తున్నారు.

4 / 6
 తర్వాత పెరుగుతుందా? ఇంకా తగ్గుతుందా?: నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 2026 చివరి నాటికి బంగారం ధర ఔన్సుకు $6,000 కు చేరుకోవచ్చని కొందరు భావిస్తున్నారు. ఒకవేళ ఇది జరిగి రూపాయి బలహీనంగా కొనసాగితే, భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధరలు రూ. 2 లక్షలకు చేరవచ్చు. అయితే ఇది చాలా వరకు ఇరాన్ యుద్ధ ఫలితం, చమురు ధరలు, డాలర్ బలంపై ఆధారపడి ఉంటుంది.

తర్వాత పెరుగుతుందా? ఇంకా తగ్గుతుందా?: నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 2026 చివరి నాటికి బంగారం ధర ఔన్సుకు $6,000 కు చేరుకోవచ్చని కొందరు భావిస్తున్నారు. ఒకవేళ ఇది జరిగి రూపాయి బలహీనంగా కొనసాగితే, భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధరలు రూ. 2 లక్షలకు చేరవచ్చు. అయితే ఇది చాలా వరకు ఇరాన్ యుద్ధ ఫలితం, చమురు ధరలు, డాలర్ బలంపై ఆధారపడి ఉంటుంది.

5 / 6
వెండి పరిస్థితి ఏమిటి?: వెండి ధర కూడా హెచ్చుతగ్గులకు లోనైంది. 2025 ప్రారంభంలో కిలోకు రూ.86,000గా ఉన్న దీని ధర 2026 నాటికి రూ.3.39 లక్షలకు పెరిగింది. అయితే గత నెల 27వ తేదీన రూ.2,85,000 వద్ద ఉండగా,  ప్రస్తుతం మార్చి 23వ తేదీన ఏకంగా 15 వేల రూపాయలు తగ్గింది. ఈ లెక్కన చూస్తే గత నెల 27 నుంచి ఇప్పటి వరకు మొత్తం 55 వేల రూపాయల వరకు దిగి వచ్చింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,30,000 వద్ద ట్రేడవుతోంది. అయితే, పారిశ్రామిక డిమాండ్ బలంగా ఉండటం, సరఫరా పరిమితంగా ఉండటం వల్ల, దీర్ఘకాలంలో దీని ధర పెరుగుతుందని అంచనా. మీరు పెట్టుబడిదారు అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం కంటే, క్రమంగా పెట్టుబడి పెట్టడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద, మార్కెట్ అస్థిరంగానే ఉంటుంది. కానీ బంగారం, వెండి రెండూ దీర్ఘకాలంలో మంచి భవిష్యత్తును కలిగి ఉన్నాయి.

వెండి పరిస్థితి ఏమిటి?: వెండి ధర కూడా హెచ్చుతగ్గులకు లోనైంది. 2025 ప్రారంభంలో కిలోకు రూ.86,000గా ఉన్న దీని ధర 2026 నాటికి రూ.3.39 లక్షలకు పెరిగింది. అయితే గత నెల 27వ తేదీన రూ.2,85,000 వద్ద ఉండగా, ప్రస్తుతం మార్చి 23వ తేదీన ఏకంగా 15 వేల రూపాయలు తగ్గింది. ఈ లెక్కన చూస్తే గత నెల 27 నుంచి ఇప్పటి వరకు మొత్తం 55 వేల రూపాయల వరకు దిగి వచ్చింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,30,000 వద్ద ట్రేడవుతోంది. అయితే, పారిశ్రామిక డిమాండ్ బలంగా ఉండటం, సరఫరా పరిమితంగా ఉండటం వల్ల, దీర్ఘకాలంలో దీని ధర పెరుగుతుందని అంచనా. మీరు పెట్టుబడిదారు అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం కంటే, క్రమంగా పెట్టుబడి పెట్టడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద, మార్కెట్ అస్థిరంగానే ఉంటుంది. కానీ బంగారం, వెండి రెండూ దీర్ఘకాలంలో మంచి భవిష్యత్తును కలిగి ఉన్నాయి.

6 / 6
Follow Us