AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Immersion: గణేశ్ నిమజ్జనోత్సవంలో అపశృతి.. సముద్రంలో ముగ్గురు యువకులు గల్లంతు..

Three boys drowned at Versova beach: గణేశ్ నిమజ్జనోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. గణేశ్ నిమజ్జనం కోసం సముద్రతీరానికి వెళ్లి ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన

Ganesh Immersion: గణేశ్ నిమజ్జనోత్సవంలో అపశృతి.. సముద్రంలో ముగ్గురు యువకులు గల్లంతు..
Ganesh Immersion
Shaik Madar Saheb
|

Updated on: Sep 20, 2021 | 11:25 AM

Share

Three boys drowned at Versova beach: గణేశ్ నిమజ్జనోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. గణేశ్ నిమజ్జనం కోసం సముద్రతీరానికి వెళ్లి ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని ముంబై నగరం జరిగింది. ముంబైలోని వెర్సోవా సముద్రతీరంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఐదుగురు బాలురు నీటిలో మునిగినట్లు అధికారులు తెలిపారు. సముద్రంలో మునిగిన వారిలో ఇద్దరిని కాపాడినట్లు వెల్లడించారు. అనుమతి లేని ప్రదేశానికి ఆ బాలురు నిమజ్జనం కోసం వెళ్లారని.. ఈ క్రమంలో అలల ధాటికి ఐదుగురు నీటిలో మునిగిపోయినట్లు తెలిపారు. గమనించిన స్థానికులు ఇద్దరిని కాపాడినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని కూపర్ ఆసుపత్రికి తరలించారు. సముద్రంలో నిమజ్జనం సందర్భంగా గల్లంతైన ముగ్గురు బాలుర కోసం ముంబై అధికారులు గాలిస్తున్నారు. గల్లంతైన బాలుర కోసం గాలించేందుకు పోలీసు బోటుతోపాటు నేవి సిబ్బందిని కూడా రంగంలోకి దించామని ముంబై చీఫ్ ఫైర్ ఆఫీసర్ తెలిపారు.

గణేశ్ నిమజ్జనం సందర్భంగా జరిగిన ప్రమాద ఘటనల్లో దేశవ్యాప్తంగా 19 మంది మృతి చెందారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 8 మంది, ఉత్తరప్రదేశ్లో 5, రాజస్థాన్లో ఇద్దరు, మహారాష్ట్రలో నలుగురు మరణించారు. యూపీలోని బారాబంకీ జిల్లాలోని కల్యాణి నదిలో నిమజ్జనం సందర్భంగా ఓ మహిళ, ఇద్దరు పిల్లలు నీటిలో మునిగినట్లు అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భిండీ జిల్లాలో నిమజ్జనం సందర్భంగా నలుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్ అజ్మీర్ జిల్లాలో చెరువులో ఇద్దరు మునిగి చనిపోయారు.

Also Read:

Punjab CM: గురుద్వారాలో ప్రత్యేక పూజలు.. పంజాబ్ కొత్త సీఎంగా చరణ్‌జీత్‌ సింగ్‌ కాసేపట్లో ప్రమాణ స్వీకారం

Sea cucumber: రూ.8 కోట్ల విలువైన సముద్ర జీవులు స్వాధీనం.. అక్రమంగా శ్రీలంకకు తరలిస్తుండగా..