AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: దారుణం.. భర్త పెట్టే బాధలు భరించలేక కొడుకుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య

భార్య భర్తల మధ్య గొడవలు రావడం సహజమే. కానీ ఆ గొడవలు తీవ్రతరమై ఒకరినొరకు చంపుకనే పరిస్థితలు కూడా ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయి. ఈ హత్యల్లో అభం శుభం తెలియని పిల్లలు చివరికి అనాథలుగానో హంతకులు గానో మిగిలిపోతున్నారు.

Vijayawada: దారుణం.. భర్త పెట్టే బాధలు భరించలేక కొడుకుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య
Representative Image
Aravind B
|

Updated on: Mar 31, 2023 | 4:42 PM

Share

భార్య భర్తల మధ్య గొడవలు రావడం సహజమే. కానీ ఆ గొడవలు తీవ్రతరమై ఒకరినొరకు చంపుకనే పరిస్థితలు కూడా ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయి. ఈ హత్యల్లో అభం శుభం తెలియని పిల్లలు చివరికి అనాథలుగానో హంతకులు గానో మిగిలిపోతున్నారు. తాజాగా బెజవాడలో జరిగిన సంఘటన కూడా ఇదే కోవలోకి వస్తుంది. భర్త పెట్టే బాధలు భరించలేక కన్న పిల్లలతో కలిసి భర్తను హత్య చేసింది భార్య. వివరాల్లోకి వెళ్తే విజయవాడకు చెందిన సురేశ్ కు అరుణ అనే మహిళతో మూప్పై ఏళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరికీ ఇద్దరు మగపిల్లలు. పెద్ద కొడుకు ఐదేళ్ల క్రితమే ఇంట్లోంచి వెళ్లిపోయి ట్రాన్స్ జెండర్ గా మారిపోయాడు. ఇక చిన్న కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు. అయితే పెళ్లైన కొద్ది కాలం నుంచే సురేష్, అరుణలో మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉండేవి. భార్య ఎప్పడు ఎదో ఒకటి అంటుందని, అడుగుతుందని సురేష్ తాగొచ్చి ఆమెతో గొడవపడుతుండేవాడు.

అయితే ఐదేళ్ల క్రతం పెద్ద కొడుకు వినీత్ అలియాస్ రోజా ట్రాన్స్ జెండర్ గా మారిపోయాక వీరి మధ్య గొడవలు మరింత ఎక్కువయ్యాయి. చిన్నతనం నుంచే పెద్ద కొడుకుని ఆడవాళ్లు చేసే పనులు చేయించడం వల్లే అతను ట్రాన్స్ జెండర్ గా మారిపోయాడని సురేశ్ ఆమెతో ప్రతిసారి వాగ్వాదం పెట్టుకునేవాడు. వినీత్ ఆరునెలలకొకసారి ఇంటికి వస్తుండేవాడు. అలా వచ్చిన ప్రతిసారి కూడా వారిమధ్య గొడవలు ఆగేవి కాదు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం వినీత్ ఇంటికి రావడంతో అతనికి తన తండ్రితో గొడవైంది. దీంతో వినీత్ తండ్రిని కొట్టి వెళ్లిపోయాడు. సాయంత్రం మళ్లీ సురేష్ తన భార్యతో గొడవపెట్టుకున్నాడు. ఈ గొడవలో చిన్న కొడుకు ఆకాశ్ కూడా జోక్యం చేసుకున్నాడు. తల్లి అరుణ, కొడుకు ఆకాశ్ లు కలిసి సురేష్ ను కొట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం సురేష్ సోదరుడు రమేశ్ కు ఫోన్ చేశారు. సురేష్ కిందపడిపోయాడని ఎంతలేపిన లేవడం లేదని చెప్పారు. రమేశ్ ఇంటికి వచ్చి చూసేసరికీ విగతజీవిగా ఉన్న తన సొదరుడ్ని చూసి మీరే చంపేసి ఉంటారని ఆరోపించాడు. అనంతరం పోలీసుల ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులకు తల్లి, కొడుకు హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. ప్రస్తుతం వాళ్లిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

Follow Us
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..!
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..!
వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
కలిసి 20 సినిమాలు.. అయినా ఆమెతో 30ఏళ్లు మాట్లాడని హీరో కృష్ణ
కలిసి 20 సినిమాలు.. అయినా ఆమెతో 30ఏళ్లు మాట్లాడని హీరో కృష్ణ
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
కష్టాల్లో ఉన్నారా? అయితే భగవంతుడు మీకు ఇస్తున్న సంకేతాలివే!
కష్టాల్లో ఉన్నారా? అయితే భగవంతుడు మీకు ఇస్తున్న సంకేతాలివే!